వెంకీ కూడా రెమ్యూనరేషన్ ని పెంచేశాడుగా..?

టాలీవుడ్లో సీనియర్ స్టార్ గా తనకంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు నటుడు వెంకటేష్. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకొనే వెంకటేష్ సరికొత్త ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. ఇప్పటివరకు అదే బ్రాండ్ తో కొనసాగించారు. ఇదంతా ఇలా ఉండగా సీనియర్ కేటగిరీలోకి వచ్చేశాక వెంకటేష్ తన వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నారు.రెగ్యులర్గా కార్షియల్ కథల జోలికి వెళ్లకుండా కొత్తదనం ఉండే కథలపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. ఇందులో ఇతర భాష సినిమాలు ఉంటే వాటిని రీమేక్ చేస్తూ ఉన్నారు. చివరిగా దృశ్యం-2, నారప్ప వంటి సినిమాలతో వెంకటేష్ మంచి విజయాలను అందుకున్నారు.

idlebrain jeevi on Twitter: "I am sure Sailesh will make it big with this  high intense action film. Good decision by Venky to go with a young  director!👍 #Saindhav Saindhav glimpse https://t.co/PaQa2m1g26" /

ప్రస్తుతం వెంకటేష్ మార్కెట్ కూడా చాలా తక్కువగా ఉంది చెప్పవచ్చు. ఇప్పుడు సరికొత్త కథలతో ట్రావెల్ చేస్తున్న వెంకటేష్ తన మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర హీరోల చిత్రాలలో గెస్ట్ రోల్స్ గా నటిస్తూ ఉన్నారు. చివరిగా ఓరి దేవుడా అనే చిత్రంలో వెంకటేష్ కనిపించారు. ఇదంతా ఇలా ఉండగా ప్రస్తుతం డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ కంప్లీట్ ఒక యాక్షన్ త్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు. ఘర్షణ సినిమా తర్వాత అలాంటి పోలీస్ ఆఫీసర్ పాత్రలో మరొకసారి కనిపించబోతున్నట్లు సమాచారం.

సైంధవ అనే టైటిల్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా క్యారెక్టర్ ప్రోమో ఇటీవల విడుదల అయింది. ఈ సినిమా కోసం హైయెస్ట్ బడ్జెట్ ని కేటాయిస్తున్నారు దీంతోపాటు రెమ్యూనరేషన్ కూడా వెంకటేష్ తన కెరియర్ లోనే హైయెస్ట్ గా తీసుకుంటున్నట్లు సమాచారం ఈ సినిమా కోసం దాదాపుగారూ. 17 కోట్ల రూపాయలు అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.