ఆ విషయంలో సుస్మితకి దారుణమైన అనుభవం.. చిరు రంగంలోకి దిగుతాడా??

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు కొణిదెల సుస్మిత మనందరికీ సుపరిచితురాలే. కాగా సుస్మిత, ఆమె భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ను ప్రారంభించారు. ఇక ఈ బ్యానర్ పై సుస్మిత నిర్మిస్తున్న మొదటి సినిమా, అంతే కాకుండా తక్కువ బడ్జెట్ తో తీస్తున్న సినిమా ‘శ్రీదేవి శోభన్ బాబు’. శ్రీదేవి శోభన్ బాబు సినిమాకి ప్రశాంత్ కుమార్ దిమ్మేల దర్శకత్వం వహిస్తున్నారు.

గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో శ్రీదేవి శోభన్ బాబు సినిమా కంటే ముందు ఆహాలో సేనాపతి, జీ5 లో షూటౌట్ ఎట్ అలైర్ లాంటి సినిమాలను ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో సుస్మిత ప్రొడ్యూస్ చేశాడు. కానీ ఆ రెండు ప్రాజెక్ట్స్ ప్రేక్షకులకు ఆమెకి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అందుకే ఈ బ్యానర్ ఎక్కడ మొదలు పెట్టారో అక్కడే ఉంది. ఇక సుస్మిత కొత్త ప్రాజెక్ట్ ‘శ్రీదేవి శోభన్ బాబు’ సినిమా ఎప్పుడో పూర్తయింది. ఈ సినిమా లో సంతోష్ శోభన్ హీరోగా నటిస్తుండగా, గౌరీ కిషన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఫిబ్రవరి 18న మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాని ప్రేక్షకులకు ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు.

తన తండ్రి చిరంజీవి ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడుతున్న సుస్మిత కి విజయం చేకూరాలని అందరూ కోరుకుంటున్నారు. సాధారణంగా చిరంజీవి సినిమాలను జడ్జి చేయడంలో చాలా నైపుణ్యం కలిగి ఉన్నాడు. నిర్మాతగా సుస్మిత సక్సెస్ రావడంలో చిరంజీవి కచ్చితంగా హెల్ప్ చేస్తాడు. ఒకవేళ ఈ సినిమా కూడా పెద్దగా ఆడకపోతే చిరంజీవి కచ్చితంగా రంగంలోకి దిగే అవకాశం ఉందని పలువురు మాట్లాడుకుంటున్నారు.