తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు నటుడు జగపతిబాబు. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా మొదలుపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు జగపతిబాబు. హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకున్న జగపతిబాబు విలన్ గా తన నటనతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటున్నారు. తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా పలు చిత్రాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
జగపతిబాబు తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన కొన్ని విషయాలను తెలియజేశారు. ప్రస్తుతం జగపతిబాబు కులాల గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. జగపతి బాబు మాట్లాడుతూ గతంలో తనకు ఎదురైన ఒక చేదు అనుభవం గురించి తెలిపారు .గతంలో విజయవాడ సిద్ధార్థ కాలేజ్ కి వెళ్లానని ఆ సమయంలో కులానికి వ్యతిరేకంగా మాట్లాడుతానని చెప్పినప్పుడు అలాంటి పనులు అసలు చేయద్దని ఆ కాలేజ్ ప్రిన్సిపల్ తనని వేడుకున్నారని తెలిపారు.
అయితే అలా ఎందుకు మాట్లాడవద్దని జగపతిబాబు అడిగితే.. కాలేజీ ఆడిటోరియంలో 2000 మంది ఉన్నారు వాళ్లంతా కమ్మ కుల పిచ్చోళ్ళు మీరు కనుక కులానికి వ్యతిరేకంగా కామెంట్ చేస్తే మీకే ప్రమాదమని ప్రిన్సిపల్ చెప్పినట్లుగా జగపతిబాబు తెలియజేశారు. కానీ ఆరోజు ప్రిన్సిపల్ విజ్ఞప్తి మేరకే కులం గురించి ప్రస్తావన తీసుకురాకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపారు. అయితే కులాల గురించి తనకు ఎలాంటి పట్టింపులు లేవని కేవలం మన టాలెంట్ ని నమ్ముకుంటే చాలు అది మన మళ్ళి ఎందాకైనా తీసుకు వెళుతుందని తెలిపారు జగపతిబాబు.