భారీ బడ్జెట్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన సాయి పల్లవి!!

ప్రముఖ నటి సాయి పల్లవి ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన వైపుకి తిప్పుకుంది. ఆమె డ్యాన్స్ తో అభిమానులను కట్టిపడేస్తుంది. అయితే డాక్టర్ చదువు చదివిన ఆమె నటనపై ఆసక్తితో సినిమాలోకి వచ్చింది. కాగా రీసెంట్ టైమ్స్‌లో సాయి పల్లవి డాక్టర్ చదువు కంప్లీట్ చేసి సొంతంగా హాస్పిటల్ పెట్టాలని ప్లాన్ చేస్తుందని టాక్ నడించింది. ఈ క్రమంలో తాజాగా సాయి పల్లవి నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

సినీ సర్కిల్ సమాచారం ప్రకారం సాయి పల్లవి రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. తమిళ్ స్టార్ హీరో ధనుష్ 50వ సినిమాలో సాయి పల్లవిని ఎంపిక చేసినట్లుగా సమాచారం. అయితే ఆ సినిమాలో నటించడానికి సాయి పల్లవి కూడా ఒప్పుకున్నారట. ఇక ధనుష్ 50వ సినిమాను రూ.100 కోట్ల బడ్జెట్‏తో ఈ సినిమాను సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక సాయి పల్లవి 2వ ప్రాజెక్ట్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్, తమిళ్ హీరో అజిత్ కాంబోలో వచ్చే సినిమా అని టాక్.

ఈ మూవీలో ఒక కీలకమైన పాత్రలో సాయి పల్లవి కనిపించనుందని సమాచారం. అయితే ఈ వార్తలలో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. అయితే గతంలో డైరెక్టర్ బాలాజీ మోహన్ తెరకెక్కించిన సాయి పల్లవి, ధనుష్ కాంబో మూవీ మారి 2 బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ మూవీ 2018 డిసెంబర్ 21న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఇందులో రౌడీ బేబీ సాంగ్ యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరోసారి ఈ సూపర్ డూపర్ హిట్ కాంబో రిపీట్ అవ్వబోతుంది. ఇక ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.