నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రష్మిక ఏకంగా ఐదు లగ్జరీ ఇళ్లు కొనుగోలు చేసింది అన్నదే ఆ వార్త సారాంశం. టాలీవుడ్ లో తక్కువ సమయంలో భారీ క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీల్లో రష్మిక ఒకటి. `పుష్ప` తర్వాత రష్మిక మరింత పాపులర్ అయింది.
సౌత్ తో పాటు నార్త్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. భారీగా సంపాదిస్తోంది. ఇలాంటి తరుణంలో ఓ వార్త తెరపైకి వచ్చింది. రష్మిక తన సంపాదనలో ఎక్కువ శాతం ప్రాపర్టీస్ పై ఇన్వెస్ట్ చేస్తోందని.. ఇందులో భాగంగానే హైదరాబాద్, కూర్గ, బెంగుళూరు, గోవా, ముంబై నగరాల్లో ఆమె ఖరీదైన అపార్ట్ మెంట్స్ కొనుగోలు చేసిందని ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అయింది.
ఈ ట్వీట్పై రష్మిక దృష్టి పడటంతో ఆమె తనదైన శైలిలో స్పందించారు. `ఇదంతా నిజమైతే బాగుండు’.. అంటూ నవ్వుతూనే నెట్టింట జరుగుతున్న ప్రచారాన్ని పరోక్షంగా ఖండించింది. దీంతో నేషనల్ క్రష్ రియాక్షన్ కాస్త నెటిజన్లను ఆకట్టుకుంటూ వైరల్గా మారింది. సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ఈ బ్యూటీ `పుష్ప 2`లో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో `యానిమల్`కు సైన్ చేసింది. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్ కూడా ఆమె చేతిలో ఉన్నాయి.