సినీ ఇండస్ట్రీ లోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది ఈ మధ్యకాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. ఇప్పటికే ఎంతోమంది హీరోలు, డైరెక్టర్ల కుమారులు సైతం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అందులో కొంతమంది సక్సెస్ కాగా మరి కొంతమంది ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఒక బాలయ్య అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్పటికే బాలయ్య సమకాలిన హీరోలు ఆయన చిరంజీవి, నాగార్జున కుమారుల సైతం ఇండస్ట్రీలోకి వచ్చి హీరోలుగా స్టార్ స్టేటస్లను అందుకుంటుంటే బాలయ్య కుమారుడు మాత్రం ఇంకా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వలేదు.
దీంతో బాలయ్య అభిమానులు కూడా చాలా నిరుత్సాహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక వార్త వినిపిస్తోంది. అదేమిటంటే 2024 ఎలక్షన్స్ అయిపోయాక బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని వార్తలు వైరల్ గా మారుతున్నాయి.. బాలయ్య ఎక్కువగా జాతకాలను నమ్మే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అందుకే అదే ఫాలో అవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ పేరు మీద ప్రస్తుతం జాతకం బాగా లేకపోవడంతో ఇప్పుడే ఎంట్రీ ఇవ్వకూడదని నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం.
అయితే ఎలక్షన్ తర్వాత మోక్షజ్ఞ కి జాతకరీత్యా సక్సెస్ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం అయితే మోక్షజ్ఞ ఎంట్రీ మీద క్లారిటీ వచ్చిందని ఇక డైరెక్టర్ విషయంలో బాలయ్య ఫుల్ క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది జగన్నాథం ఒక సినిమాని బోయపాటి శ్రీను తో ఒక సినిమాని చేయబోతున్నట్లు సమాచారం.ఒకేసారి ఇద్దరు డైరెక్టర్లను లైన్లో పెట్టి తన కుమారుని సినిమాలను చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై బాలయ్య క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి.