కంగనా రనౌత్ ఎవరికీ భయపడదు. ముఖ్యమంత్రికి కూడా భయపడకుండా ఆమె కామెంట్లు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ధైర్యానికి పెట్టింది పేరుగా కంగనా రనౌత్ ఇప్పటికే తన మనసులోని ఎన్నో మాటలను బయటపెట్టింది. కాగా తాజాగా ఆమె ప్రముఖ బాలీవుడ్ నటుడి గురించి కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఆ నటుడు పిలవకుండానే తన ఇంటికి వచ్చి తనపై బలవంతం చేసేందుకు ప్రయత్నించాడని చెప్పింది. ఆమె నటుడి పేరు బయట పెట్టలేదు కానీ ఆమె రణ్బీర్ కపూర్ గురించి మాట్లాడుతుందని చాలామంది భావిస్తున్నారు.
రణ్బీర్ అద్దె మనుషులు తనను ఫాలో అవుతున్నారని, తాను వెళ్లిన ప్రతిచోటా ఫోటోగ్రాఫర్లు తనను ఫాలో అవుతున్నారని, అందువల్ల తాను అసౌకర్యంగా భావిస్తున్నానని కూడా ఆమె చెప్పింది. రణ్బీర్ ఉమెనైజర్ అని, అతని ప్రవర్తనకు అతని భార్య అలియా భట్ మద్దతు ఇస్తుందని కంగనా చెప్పింది. తన భర్త చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉన్నందున అతనిపై నిఘా ఉంచాలని అలియాకి ఆమె సూచించింది.
కంగనా ఎవరిని టార్గెట్ చేస్తుందో సోషల్ మీడియాలో జనాలు ఊహాగానాలు చేస్తున్నారు. రణబీర్, అలియా అభిమానులు కొందరు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయకుండా తన సినిమాలపైనే దృష్టి పెట్టి తన నటనతో నిరూపించుకునే ప్రయత్నం చేయాలని హితవు పలుకుతున్నారు. ఉమెనైజర్ అంటే పెద్ద కామాంధుడు, అమ్మాయిలతో లైంగికంగా సంబంధాలు పెట్టుకునే తిరుగుబోతు అని అర్థం. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల కంగనా ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారింది.
గతంలో బాలీవుడ్ హీరో హీరోయిన్ల పై కూడా కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా అలియా నటనను ఆమె ఎక్కువగా విమర్శిస్తూ ఉంటుంది. అలాగే ఒకసారి హృతిక్ రోషన్ పై దారుణమైన కామెంట్స్ చేసింది.