న్యాచురల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం `దసరా`. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని కెరీర్ లో తెరకెక్కిన తొలి పాన్ ఇండియా చిత్రమిది. సాయికుమార్, సముద్రఖని, జరీనా వహబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
గోదావరిఖని సింగరేణి బ్యాక్డ్రాప్లో స్నేహం, ప్రేమ అంశాలతో ఈసినిమా తెరకెక్కుతోంది. సంతోష్ నారాయణన్ స్వరాలు అందిస్తున్నాడు. మార్చి 30వ తేదీన థియేటర్లలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే బయటకు వచ్చిన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశారు. ఈ చిత్రంలో నాని మున్నెప్పుడూ కనిపించనంత మాస్ లుక్ లో అలరించబోతున్నాడు.
ఇకపోతే ఈ మూవీ బడ్జెట్, నాని రెమ్యునరేషన్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. మొదట దసరా సినిమాను రూ. 35 కోట్ల బడ్జెట్ తో ముగించాలని నిర్మాతలు అనుకున్నారట. కానీ, ఫైనల్ గా అయిన బడ్జెట్ రూ. 65 కోట్లు. అంటే డబుల్ బడ్జెట్ అయింది. పైగా నాని కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ ఇది. అలాగే ఈ సినిమాకు నాని ఏకంగా రూ. 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడట. అయితే మేకర్స్ చేస్తున్న ప్రమోషన్స్ కారణంగా ఈ సినిమాకు రూ. 80 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని టాక్ నడుస్తోంది.