బుల్లితెరపై ఎంతో ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే తెలుగులో 6 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో 7 సీజన్ కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్స్ వేటలో పడ్డారు. గత 5 సీజన్లో కూడా తెలుగు బిగ్ బాస్ భారీ టిఆర్పి రేటింగ్తో దూసుకుపోయింది. అయితే గత ఆరో సీజన్ మాత్రం ప్రేక్షకుల దగ్గర నుంచి సరైన రెస్పాన్స్ అందుకోలేక బొక్క బోర్లా పడింది. అయితే గత సీజన్ లో వచ్చిన కంటెస్టెంట్స్ పెద్దగా ఎవరికి పరిచయం లేకపోవడంతో ఆదరణ పొందలేదు అంతేకాకుండా వారు హౌస్ లో పెద్దగా ఎంటర్టైన్మెంట్ కూడా అందించలేకపోయారని టాక్.
దీంతో ఇప్పుడు వచ్చే కొత్త సీజన్లో మాత్రం అలాంటి తప్పులు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తగా కంటెస్టెంట్స్ ను సెలెక్ట్ చేస్తున్నారు. అందుకోసం మంచి ఫేమస్ అయిన నటీనటులను ఈ హౌస్ లోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడో సీజన్ పై ఓ ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ గా మారింది. ఈ సీజన్ కంటెస్టెంట్ గా హాట్ యాంకర్ రష్మి గౌతమ్ను బిగ్ బాస్ నిర్వహకులు సంప్రదించారని తెలుస్తుంది. వారు ఆమెతో చర్చించగా ఆమె భారీ పారితోషికం కూడా డిమాండ్ చేసినట్టు టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
ఇక ఆమె ఒక్కో వారానికి 7 నుంచి 8 లక్షల పారితోషికం ఇవ్వాలని బిగ్ బాస్ నిర్వహకులను డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా రష్మి బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి మరికొన్ని కండిషన్స్ కూడా పెట్టినట్టు తెలుస్తుంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే రష్మి కానీ బిగ్ బాస్ నుంచి కానీ అధికార ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి. బుల్లితెరపై యాంకర్ రష్మీకి మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రష్మీతో పాటు సుధీర్ అన్న కూడా హౌస్ లో ఉంటే బాగుంటుందంటూ సోషల్ మీడియా ద్వారా తమ కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.