నందమూరి తారకరత్న అటు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇక సినిమాలలో సక్సెస్ కాలేకపోవడంతో పలు వెబ్ సిరీస్లలో కూడా నటించారు. దీంతో అవకాశాలు రాకపోవడంతో తారకరత్న రాజకీయాల వైపు అడుగు వేశారు.అలా గడిచిన కొద్ది రోజుల క్రితం నారా లోకేష్ ప్రారంభించిన యువగళం అని పేరుతో పాదయాత్రను మొదలుపెట్టారు ఈ పాదయాత్ర ముందు నుంచే తారకరత్న దగ్గరుండి చూసుకున్నారు.ఈ పాదయాత్ర మొదలుపెట్టిన రోజు నారా లోకేష్ తో కలిసి కొద్దిగా దూరం నడిచేసరికి హార్ట్ ఎటాక్ తో తారకరత్న కింద పడిపోవడం జరిగింది.
దీంతో ఆ వెంటనే అక్కడున్న కొంతమంది అభిమానులు నాయకులు కుప్పంలో హాస్పిటల్ కి జాయిన్ చేయడం జరిగింది.కానీ పరిస్థితి చేయి దాటిపోయిందని భావించి బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చేర్పించారు. వారం రోజులు గడుస్తున్న అతని ఇంకా స్పృహలోకి రాలేదని తెలుస్తోంది. అయితే ప్రమాదమే అయితే తప్పిందని వైద్యులు తెలియజేసినట్లు తెలుస్తోంది. హృదయాలయ హాస్పిటల్లో తారకరత్న చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే దాదాపుగా రూ.80 లక్షలకు పైగా ఖర్చు అయినట్లు సమాచారం.
ఈ ఖర్చు మొత్తాన్ని చంద్రబాబు నాయుడు భరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే నందమూరి కుటుంబంలో ఆర్థికంగా వెనుకబడినది కేవలం తారకరత్న మాత్రమే ముఖ్యంగా ఆస్తిలో కూడా కొంత భాగాన్ని పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. నారా కుటుంబం తారకరత్నకు అలాగే అతని భార్య పిల్లలకు అండగా నిలబడ్డారని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య , ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా తారకరత్న కి అండగా నిలబడడం తో ప్రతి ఒక్కరు కూడా నందమూరి కుటుంబాన్ని ప్రశంసిస్తున్నారు.