బిగ్ అప్డేట్: సమంత రేంజ్ మామూలుగా లేదుగా.. ఈసారి ఏం చేస్తుందో తెలుసా..!?

స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. స్టార్ హీరోయిన్ లో మొదటగా వినిపించే పేరు.. తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించి తర్వాత వరుస స్టార్ హీరోల సినిమాలలో నటించి అతి కొద్ది రోజుల్లోనే ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి సమంత తన మొదటి సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడి అక్కినేని ఇంటి కోడలు అయింది.

అప్పటినుంచి ఆమె రేంజ్ మరో లెవల్ కు వెళ్ళింది. కానీ తర్వాత ఏమైందో తెలియదు కానీ వారి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని దూరమయ్యారు. ఈ వార్తతో అందరినీ బాధ పెట్టింది ఈ జంట. ఇదిలా ఉంటే సమంత నాగచైతన్య నుంచి దూరమైనప్పటి నుంచి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతుంది. వీటితో పాటు కొన్ని కోట్ల విలువ చేసే బంగ్లాలను కొనుగోలు చేసి అందరికీ షాక్ ఇస్తుంది. గత సంవత్సరం సమంతా నటించిన యశోద సినిమా విడుదలై మంచి విజయాన్ని అందించిన విషయం తెలిసిందే.

ఈమె నటించిన మరో లేడీ ఓరియంటెడ్ సినిమా శాకుంతలం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మధ్యనే సమంత మయోసైటిస్ అనే వ్యాధి భారిన పడి ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి కోలుకుంది.. ప్రస్తుతం ఈమె హాలీవుడ్ మూవీ సిటాడల్, ఖుషి సినిమాల షూటింగ్లో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉంది. తాజాగా ఇప్పుడూ సమంతకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయం ఏమిటంటే సమంత ఇండియాలోనే ఖరీదైన ప్రదేశాలలో ఇళ్లను కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తుంది.

samantha

రీసెంట్గా సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.. అది కూడా సన్ సెట్ కి సంబంధించిన ఒక ఫోటోను పెట్టింది. ఆ ఫోటోను జాగ్రత్తగా పరిశీలిస్తే అది ఫైవ్ స్టార్ హోటల్ నుంచి దిగిన ఫోటో.. అది కూడా అత్యంత ఖరీదైన భారీ ధనవంతులు నివసించే ఏరియాలో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ ఫోటో చూసిన చాలా మంది నెటిజన్స్ ముంబైలో సమంత కొత్త ఇల్లును కొనుగోలు చేసి ఆ ఇల్లు బాల్కనీ నుంచే ఆ ఫోటో తీసింది కావచ్చు అని భావిస్తున్నారు..ఆ ఇల్లు దాదాపు రూ.15 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.. సమంత కు అది తక్కువే.. షూటింగ్ లేనప్పుడు అక్కడ ఉంటుందని తెలుస్తుంది.