ఈ సంక్రాంతికి స్టార్ హీరోల మధ్య మాత్రమే కాకుండా టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య కూడా గట్టి పోటీ నెలకొంది. ముందుగా వీర సింహారెడ్డి తో థమన్ ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ సినిమాకు 24 గంటల తేడాతో వాల్తేరు వీరయ్య తో దేవిశ్రీ ప్రసాద్ ఇలా ఇద్దరూ మ్యూజిక్ డైరెక్టర్లు పోటీ పడుతున్నారు.
వీటితోపాటు మరో పక్క కోలీవుడ్ హీరో విజయ్ నటించిన వారిసు సినిమా కూడా థమన్ మ్యూజిక్ అందించాడు.
ఈ రెండు సినిమాలతో థమన్ మ్యూజిక్ పరంగా ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి మార్కులే కొట్టేసాడు. వారిసు సినిమాకి మెలోడీ మ్యూజిక్ తో మెప్పించిన థమన్. వీర సింహారెడ్డి సినిమాకు మాత్రం మాస్ మ్యూజిక్ తో పూనకాలు తెప్పించాడు. ఈ సినిమా కూడా అఖండల థియేటర్లో బాక్సులు బద్దలై పోయే విధంగా మ్యూజిక్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలతో కూడా థమన్ పై చేయి సాధించాడు.
ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా విడుదలకు ముందు నుంచే తన మ్యూజిక్ తో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాడు దేవి. ఇప్పుడు సినిమా ప్రేక్షకులు ముందుకు రాగా దేవిశ్రీ కూడా తన పాత సినిమాలకు భిన్నంగా ఈ సినిమాకు అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చాడు. ఈ సినిమా పాటల విషయానికొస్తే మాత్రం కొంత నిరాశపరిచాడనే చెప్పాలి. దీంతో ఈ ఇద్దరి పోటీలో థమన్నే పై చేయి సాధించాడు.