నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో సూపర్ హిట్ను తన ఖాతలో వేసుకున్నారు. ఆ తరువాత వరుస గా అటు వెండి తెరపై ఇటు బుల్లి తెరపై కూడా బాలయ్య అదరగొడుతున్నాడు. ప్రస్తుతం వీర సింహరెడ్డి సినిమా ప్రమోషన్స్లో బీజీగా ఉన్నా బాలకృష్ణ.. నిన్నటి రోజున ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా ఒంగోల్ లో ఎంతో గ్రాండ్గా జరిగింది. అక్కడ ఈ సినిమా ట్రైలర్ను కూడా విడుదల చేయడం జరిగింది.
సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిన్న రాత్రి వచ్చిన ఈ సినిమా ట్రైలర్ లోనే బాలయ్యతన ఉగ్రరూపాన్ని చిన్న శాంపిల్ గా ప్రేక్షకులకు చూపించారు. ఇంకేముంది వీరసింహుడి పవర్ఫుల్ డైలాగులు, యాక్షన్ సన్నివేశాలు డైరెక్టర్ టేకింగ్ లతో.. ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది.
దీంతో కొన్నిగంటల్లో ఈ ట్రైలర్ #1 పొజిషన్ కైవసం చేసి, యూట్యూబ్ ని రూల్స్ చేస్తుంది. ఇప్పటివరకు ఈ ట్రైలర్ కు 5 మిలియన్ వ్యూస్, 300కు పైగా లైక్స్ వచ్చాయి. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ ఈ సినిమాలో కీరోల్స్ ప్లే చేసారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు. ఈ సినిమాతో బాలకృష్ణ ఎలాంటి రికార్డు సృష్టిస్తారో చూడాలి.