రూ. 74 కోట్ల టార్గెట్‌.. మూడు రోజుల్లో `వీర సింహారెడ్డి`కి వ‌చ్చిందెంతో తెలుసా?

నట సింహం నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మ‌లినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. ఇందులో శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటిస్తే.. దునియా విజయ్ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు.

భారీ అంచనాలు నడుమ జనవరి 12న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అయినప్పటికీ ఈ చిత్రం తొలి రోజు భారీ ఓపెనింగ్స్ ను సాధించింది. రెండో రోజు పోటీగా మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `వాల్తేరు వీరయ్య` రావడంతో వీర సింహారెడ్డి కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి. ఇక మూడో రోజు మాత్రం రెండవ రోజుకి మించి వ‌సూళ్ల‌ను రాబట్టింది.

3వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.45 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకున్న ఈ చిత్రం రూ. 10.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 7.30 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుంది. ఇక రూ. 74 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. మూడు రోజుల్లో రూ.44.50 కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను అందుకుంది. అంటే ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ గా నిల‌వాలంటే ఇంకా రూ. 29.50 కోట్ల షేర్‌ను అందుకోవాల్సి ఉంటుంది. ఇక ఏరియాల‌ వారీగా వీర సింహారెడ్డి 3 రోజుల టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను గ‌మ‌నిస్తే..

నైజాం: 9.84 కోట్లు
సీడెడ్: 9.98 కోట్లు
ఉత్త‌రాంధ్ర: 3.67 కోట్లు
తూర్పు: 2.73 కోట్లు
పశ్చిమ: 2.54 కోట్లు
గుంటూరు: 4.24 కోట్లు
కృష్ణ: 2.43 కోట్లు
నెల్లూరు: 1.62 కోట్లు
—————————————–
ఏపీ+తెలంగాణ‌=37.05కోట్లు(59.10కోట్లు~ గ్రాస్‌)
—————————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 3.05 కోట్లు
ఓవ‌ర్సీస్‌ – 4.40 కోట్లు
—————————————-
వ‌ర‌ల్డ్ వైడ్‌= 44.50 కోట్లు(73.90కోట్లు~ గ్రాస్‌)
—————————————-