అలా చేయ‌లేకే విల‌న్‌గా మారా.. వైర‌ల్ గా మారిన వ‌ర‌ల‌క్ష్మి షాకింగ్ కామెంట్స్‌!

నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ.. ఆ తర్వాత విలన్ గా మారి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తోంది. ఇటీవ‌ల యశోద సినిమాతో హిట్ అందుకున్న వరలక్ష్మి.. ఈ సంక్రాంతికి `వీర సింహారెడ్డి` సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమైంది.

 

అలాగే లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తూ కెరియర్ పరంగా జోరు చూపిస్తోంది. తెలుగు తమిళ మలయాళ భాషల్లో ఫుల్ బిజీగా ఉన్న వరలక్ష్మి.. తాజాగా వీర సింహారెడ్డి ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. అయితే హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన విలన్ గా మారడానికి కారణం ఏంటి అని వరలక్ష్మిని ప్రశ్నించగా.. ఆమె షాకింగ్ కామెంట్స్‌ చేసింది.

గ్లామర్ పాత్రలు తనకు వర్కౌట్‌ కావని, గ్లామర్ రోల్స్ చేయలేకే విలన్ గా మారానని వరలక్ష్మి చెప్పుకొచ్చింది. గ్లామర్ రోల్స్ చేయడానికి చాలా మంది ఉన్నారని.. కానీ ఇలాంటి కొన్ని పాత్రలు తానే చేయగలనని వరలక్ష్మి చెప్పుకొచ్చింది. అంతేకాదు ప్రతినాయకి పాత్రల్లో నటిస్తూ చాలా సంతోషంగా ఉన్నానని కూడా వరలక్ష్మి చెప్పుకొచ్చింది. మ‌రి ఈ అమ్మ‌డు `వీరి సింహారెడ్డి`తో ఎలాంటి విశ్వ‌రూపాన్ని చూపిస్తుందో చూడాలి.