రిషబ్ పంత్ ఆసుపత్రికి ఊర్వశి… వామ్మో ఏదో తేడా కొడుతోందిగా..!

బాలీవుడ్ హాట్ నటి ఊర్వశీ రౌతేలా ఇప్పుడు మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక రీసెంట్‌గా రోడ్డు ప్రమాదానికి గురైన టీమ్ ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ చికిత్స తీసుకుంటున్న ఆస్పత్రి ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక దీంతో నేటీజ‌న్లు మరోసారి ఊర్వశిపై ట్రోల్స్‌ చేస్తున్నారు. ఇటీవ‌ల కారు యాక్సిడెంట్‌లో గాయ‌ప‌డిన పంత్ ను ప్ర‌స్తుతం మెరుగైన వైద్యం కోసం ముంబైలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

Rishabh Pant undergoes minor plastic surgery on injured forehead, out of  danger

దీంతో రిషబ్ చికిత్స పొందుతున్న ఆసుపత్రి ఫోటోను ఊర్వశి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇక అది చూసిన అభిమానులు ఊర్వశి నిజంగా పంత్‌ను కలిసిందా ? అని షాక్ అవుతున్నారు. రిషబ్ పంత్ ఢిల్లీ నుంచి తన సొంత రాష్ట్రానికి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Rishabh Pant fans trolled Urvashi Rautela brutally after car Accident stop  fashion show said shameless | Urvashi Rautela: उर्वशी ने शेयर की ऐसी  तस्वीर, लोग बोले- हमारा भाई अस्पताल में है, इनका

ఇక పంత్‌ కోలుకోవాలని సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ప్రార్థించారు. ఉత్త‌రాంఖండ్ సీఎం సైతం పంత్‌ను హాస్ప‌ట‌ల్లో క‌లుసుకుని పరామ‌ర్శించి వ‌చ్చారు. పంత్ క‌నీసం కోలుకునేందుకు ఆరు నెల‌లు ప‌డుతోందంటున్నారు.

Urvashi Rautela's Mother Gets Trolled For Posting About Rishabh Pant 'Daamad Ji...'

ఇక ఇటీవ‌లే ఊర్వశి తల్లి కూడా పంత్‌ కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అందులో భాగంగా తన సోషల్ మీడియాలో రిషబ్ ఫోటోలు షేర్ చేసింది. ఇక ఇప్పుడు ఊర్వాశి కూడా పంత్ ఫొటోను షేర్ చేయ‌డంతో ఒక్కసారిగా ఊర్వశి- పంత్ మరోసారి హైలెట్ అయ్యారు. మొత్తానికి వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో న‌డుస్తోంద‌న్న గుస‌గుస‌లు అయితే మ‌రింత‌గా ఎక్కువ అయ్యాయి.