ప్రముఖ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన `శాకుంతలం` విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. అద్భుతమైన ప్రేమ కావ్యంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో దేవ్ మోహన్, సమంత జంటగా నటించారు. మణిశర్మ స్వరాలు అందించాడు.
గత ఏడాదే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల వాయిదా వేశాడు. ఇక ఫైనల్ గా ఈ చిత్రం ప్రేమికుల కానుకగా ఫిబ్రవరి 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. పోస్ట్ ప్రొడెక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి.. సమంత సైతం డబ్బింగ్ పనులు షురూ చేసింది. అయితే మయోసైటిస్ వ్యాధి కారణంగా సమంత గత కొద్ది రోజుల నుంచి ఇంటికే పరిమితం అయింది.
తన గత చిత్రం యశోద ప్రమోషన్స్ కు కూడా హాజరు కాలేదు. అయినాసరే ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక శాకుంతలం ప్రమోషన్స్ లో కూడా సామ్ కనిపించదని కొందరు భావించారు. కానీ, మయోసైటిస్ నుంచి సామ్ కొలుకుంది. `శాకుంతలం` ప్రమోషన్స్ కు డేట్స్ కూడా ఇచ్చేసింది. వారం రోజులు ఈ మూవీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటానని సమంత మేకర్స్ కు హామీ ఇచ్చిందట. ఇక ఈ సినిమా విడుదల అనంతరం సామ్ షూటింగ్స్ లోనూ జాయిన్ కానుందని అంటున్నారు.