మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ హీరోలుగా బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `వాల్తేరు వీరయ్య` ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో శృతిహాసన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. రాజేంద్ర ప్రసాద్, బాబీ సింహా, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలను పోషించారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్నానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు. సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తోనే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఇకపోతే ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా ఐటమ్ సాంగ్ లో మెరిసిన సంగతి తెలిసిందే.
`బాస్ పార్టీ` పాటలో చిరంజీవితో కలిసి ఊర్వశి స్టెప్పులేసింది. చిరు ఎనర్జీకి ఏ మాత్రం తగ్గకుండా గ్రేస్ఫుల్ డ్యాన్స్ తో ఇరగదీసింది. అలాగే గ్లామర్ షోతోనూ ఆకట్టుకుంది. అయితే ఈ సాంగ్ కు ఊర్వశి అందుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా కథనాల ప్రకారం.. `బాస్ పార్టీ` సాంగ్ కోసం ఊర్వశి ఏకంగా రూ. 2 కోట్లు ఛార్జ్ చేసిందట. ఒక సినిమాకు పుచ్చుకోవాల్సిన రెమ్యునరేషన్ ను ఊర్వశి ఓ సాంగ్ ద్వారానే సంపాదించేసింది.