మొదటి సినిమాతోనే హిట్ కొట్టి, టాలీవుడ్లో పాగా వేసిన ముద్దుగుమ్మలు వీరే?

మన టాలీవుడ్లోకి వచ్చిన హీరోయిన్ అంత త్వరగా ఇతర సినిమా పరిశ్రమలలోకి వెళ్లాలని యోచించదు. ఎందుకంటే ఇక్కడ అవకాశాలు ఎక్కువ, ముఖ్యంగా రెమ్యునరేషన్స్ చాలా ఎక్కువ. అందుకే ఇక్కడికి వచ్చినవారు ముందుగా దండిగా సంపాదించాలనే నెపంతోనే వస్తారు. ఈ క్రమంలో చేసిన మొదటి సినిమా హిట్ అయిందంటే ఇక అంతే. వారు ఇక్కడ పాగా వేసినట్టే. అలాంటి హీరోయిన్ లు మనదగ్గర చాలామంది వున్నారు. ఇపుడు అలాంటివారి గురించి తెలుసుకుందాం.

ఇందులో మొదటగా నేడు అగ్ర హీరోయిన్ గా రాణిస్తున్న సమంత గురించి చెప్పుకోవాలి. ఆమె చేసిన మొదటి సినిమా ఏం మాయ చేసావే. ఈ మూవీతో ఆమె హిట్టు కొట్టడమే కాకుండా యావత్ టాలీవుడ్ యువత మనసుల్ని గెలుచుకున్నారు. ఆ తరువాత కూడా తడబడకుండా సమంత చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంది. తరువాత చెప్పుకోదగ్గ పేరు రకుల్. అవును, వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ హిట్ అందుకుని వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయింది. నిన్న మొన్నటివరకు ఇక్కడ రాణించిన రకుల్ ప్రస్తుతం బాలీవుడ్లో పాగా వేయాలని చూస్తోంది.

ఆ తరువాత సాయిపల్లవి గురించి చెప్పుకోవాలి. ఫిదా మూవీతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి తొలిసినిమా తోనే తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. ఆ తరువాత కూడా ఈ అమ్మడు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు స్కోప్ గల సినిమాలు చేస్తూ వరుస హిట్స్ తో దూసుకుపోతోంది. ఈ లిస్టులో చివరగా రాశి ఖన్నా గురించి చెప్పుకోవాలి. ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రాశీఖన్నా ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా సినిమాలు చేస్తూ వరుస హిట్లతో అందరికంటే ముందంజలో వుంది.