ఘ‌నంగా నటి పూర్ణ సీమంతం వేడ‌క‌.. నెట్టింట‌ వైరలవుతోన్న ఫోటోలు!

ప్రముఖ నటి పూర్ణ గ‌త ఏడాది ఓ ఇంటిది అయిన సంగ‌తి తెలిసిందే. దుబాయ్‌ వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ సీఈవో అయిన షానిద్ ఆసిఫ్ అలీతో 2022 జూన్ 12న పూర్ణ ఏడడుగులు వేసింది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు సమక్షంలో పూర్ణ, ఆసిఫ్ అలీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

పెళ్లి జ‌రిగిన కొద్ది నెల‌ల త‌ర్వాత పూర్ణ ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. అయితే పూర్ణ త్వరలో తల్లి కాబోతోంది. ఇటీవల ఆమె తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అయితే తాజాగా పూర్ణ సీమంతం వేడుక ఘనంగా జరిగింది.

ఈ వేడ‌క‌లో పూర్ణ రెడ్ క‌ల‌ర్ శారీలో ఎంతో అందంగా మెరిపిపోతూ క‌నిపించింది. అలాగే ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబ‌ర్స్ తో ఉత్సాహంగా ఫోటోలు దిగింది. ప్ర‌స్తుతం పూర్ణ సీమంతం ఫోటోలో నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

కాగా, శ్రీ మహాలక్ష్మి, అవును, సీమ టపాకాయ్‌, అఖండ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన పూర్ణ‌.. చివ‌ర‌గా ఆది తీస్‌మార్‌ ఖాన్ సినిమాలో కనిపించింది పూర్ణ. ప్రస్తుతం నాని `దసరా` సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే మ‌రిన్ని ప్రాజెక్ట్స్ కూడా పూర్ణ చేతిలో ఉన్నాయి.