అన్ని బాగున్నా వీరసింహారెడ్డి లో..అది ఒక్కటే లోటు..రాడ్ పెట్టేసావ్ కదా రా సామీ..!!

వావ్.. నందమూరి అభిమానులకు రెండు మూడు రోజులు ముందే సంక్రాంతి పండుగ వచ్చేసింది . టాలీవుడ్ నట సిం హం నందమూరి బాలయ్య హీరోగా తెరకెక్కిన వీర సింహారెడ్డి సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది . ఫస్ట్ షోకే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ జనాలు కమిట్ అయిపోయారు . అంతేకాదు సినిమాపై నందమూరి హీరో బొమ్మ పడగానే సినిమాలో ఎలాంటి మాస్ యాంగిల్ ఉంటుందో ఏ రేంజ్ లో అభిమానులను అట్రాక్ట్ చేయడానికి రెడీ అయిపోయాడో అర్థం అయిపోయింది .

అంతేకాదు గోపీచంద్ మలినేని సైతం సినిమా విషయంలో చాలా కేర్ తీసుకొని ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ బాలయ్యకు బోయపాటి నే కాదు నేను హిట్ ఇవ్వగలను అంటూ ప్రూవ్ చేశాడు. కాగా కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన బాలయ్య వీర సింహారెడ్డి పై సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా రకరకాల రివ్యూస్ వైరల్ అవుతున్నాయి . అయితే 80% కాదు 90% బాలయ్యకు నెగిటివ్గా ఉండే జనాలు కూడా వీరసింహారెడ్డి పై పాజిటివ్ కామెంట్స్ కురిపిస్తున్నారు. దానికి మెయిన్ రీజన్ ఈ సినిమాలో కర్త – కర్మ – క్రియ అన్ని బాలయ్య అయ్యి తానే ఈ సినిమాని నిలబెట్టడం.

అంతేకాదు గోపీచంద్ .. బాలయ్యకు ఎంత బిగ్ ఫ్యాన్ అనే విషయం ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేసుకున్నాడు . అయితే సినిమాలో మాస్ , క్లాస్, యాక్షన్ , ఫైట్ , రొమాంటిక్ , లవ్, సెంటిమెంట్ ఎమోషన్స్ అన్ని కలగల్సి ఉన్నా ..కానీ ఒక్క విషయంలో మాత్రం గోపీచంద్ అభిమానులకు దెబ్బేశాడనే చెప్పాలి . సినిమాలో బాలయ్య శృతిహాసన్ మధ్య ఓ రేంజ్ లో కెమిస్ట్రీని ఎక్స్పెక్ట్ చేశారు జనాలు.

అయితే సినిమా చూసిన తర్వాత ఈ సినిమాలో శృతిహాసన్ క్యారెక్టర్ ఏముంది ..? అసలు ఎందుకు పెట్టాడు..? అన్నంత టాక్ వినిపిస్తుంది. ఆ ఒక్క విషయంలో తప్పిస్తే సినిమాని మరి ఏ విషయంలోనూ వేలెత్తి చూపే విధంగా లేదు. ఒక్క మాటలో యాంటీ నందమూరి ఫ్యాన్స్ కి బిగ్ రాడ్ దించేశాడు గోపీచంద అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి కలెక్షన్స్ పరంగా ఈ సినిమా ఏ విధంగా అభిమానులను సాటిస్ఫై చేస్తుందో..?