వారిపై ఫైర్ అయిన శృతిహాసన్.. ఇంతకీ ఏం జరిగిందంటే…

ప్రస్తుతం టాలీవుడ్‌లో శృతి హాసన్ హవా నడుస్తుంది. చాలా కాలం తరువాత ‘క్రాక్’ సినిమాతో టాలీవుడ్‌లో రీ-ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ మంచి హిట్ అందుకుంది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాలో శృతి హాసన్ గెస్ట్ రోల్‌లో నటించింది. క్రాక్ సినిమా విజయం తరువాత శృతికి ‘సలార్’ అనే పాన్ ఇండియా మూవీలో నటించే అవకాశం వచ్చింది. ఈ మూవీతో మొదటిసారి ప్రభాస్‌తో జత కట్టబోతుంది. అలానే టాలీవుడ్ సీనియర్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి లతో కలిసి నటించే అవకాశాలు సంపాదించుకుంది. ఇక ఆమె ఆ రెండు ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పేసింది. అయితే కొంతమంది మాత్రం విషయం గురించి శృతి హాసన్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. శృతి హాసన్ కి సరైన అవకాశాలు రావడం లేదని, అందుకే సీనియర్ నటులతో నటించడానికి రెడీ అయిందని కామెంట్ చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవితో నటించిన ‘వాల్తేర్ వీరయ్య’, బాలకృష్ణ సరసన నటించిన ‘వీర సింహ రెడ్డి’ సినిమా లు రెండు ఈ సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా శృతి నటించిన రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యింది పోటీ పడబోతున్నాయి. ఇలాంటి సమయంలో కొంతమంది నెటిజనులు శృతి హాసన్ ని ‘ నీ తండ్రి వయసు ఉన్న హీరోల పక్కన నట్టిస్తున్నావ్ ఎందుకు? నీకు అవకాశాలు రావడం లేదా? లేక డబ్బు కోసం ఇలాంటి నీ తండ్రి వయసున్న హీరోలతో నటించడానికి ఒప్పుకున్నావా? అంటూ శృతి హాసన్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఈ ప్రశ్నలనీటికి శృతి హాసన్ మాత్రం గట్టిగానే సమాధానం చెప్తుంది. సినీ ఇండస్ట్రీ లో వయసుతో సంబంధం లేదు, ప్రతిభ ఉంటే మరణించేవరకు నటించవచ్చని సమాధానం ఇచ్చింది. ఇప్పటి వరకూ చాలా మంది సీనియర్ హీరోలు చిన్న వయసు ఉన్న హీరోయిన్స్ తో జతకట్టారు. అలాంటపుడు నేను నటిస్తే తప్పేముంది అని తనపై వచ్చే నెగిటివ్ కామెంట్స్ పై ఫైర్ అయింది.