అన్నీ తెలిసి ఆ పని చేశాను అంటున్న శృతిహాసన్..!!

ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన చిత్రాలలో వాల్తేర్ వీరయ్య లో చిరంజీవి సరసన శృతిహాసన్ నటించింది , అలాగే వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ నటించింది. ఈ రెండు చిత్రాలలో హీరోయిన్గా శృతినే నటించింది. అయితే రెండు చిత్రాలలో కూడా ఈమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. కేవలం హీరోయిన్ గా పేరు ఒకటి ఉన్నది ఇక సినిమాలలో పాటల డాన్సులో కూడా కనిపించినట్లు ఆమె పాత్ర సాగింది. అయితే ఇలాంటివన్నీ తెలిసి కూడా తన సినిమాలలోనే నటించానని తెలియజేస్తోంది.

Shruti Haasan biography, wiki, age, height, husband, religion, caste & more
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్ ఈ విషయం మీద మాట్లాడడం జరిగింది.. తన తండ్రి సమకాలికులైన మెగాస్టార్ చిరంజీవి ,నందమూరి బాలకృష్ణ తో కలిసి సినిమాలు చేయడానికి గల కారణం నేను పెద్ద సినిమాలు సైన్స్ చేయాలనుకోవడమే అని తెలియజేసింది. వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య సినిమాలలో తన పాత్ర చిన్నది అయినా కేవలం సాంగులకే పరిమితం అవుతుందని తెలిసిన అందుకే సినిమాలలో నటించాలని చెప్పుకొచ్చింది. ఒకరకంగా 2019లో శృతిహాసన్ ట్రాక్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అది 2021లో విడుదల అయింది ఆ తర్వాత ఆమె ఒక్క తెలుగు సినిమాలలో కూడా నటించలేదు

బాలయ్య-చిరు వయసుపై అలాంటి కామెంట్స్ చేసిన శృతి | Shruti To Give Calrity On  Age Related Comments, Shruti Haasan, Salaar, Nandamuri Balakrishna,  Chiranjeevi, Waltair Veerayya, Veera Simha Reddy - Telugu Salaar ...
దీంతో గోపీచంద్ మలినేని మళ్లీ పిలిచి బాలకృష్ణ సినిమాలో అవకాశం ఇచ్చారు. పెద్ద సినిమా కదా అని ఒప్పుకున్నానని తెలిపింది. ఆ తర్వాత వాల్తేరు వీరయ్య లో కూడా అదే ధైర్యంతో హీరోయిన్గా నటించడానికి ఒప్పుకున్నానని తెలిపింది. అందరూ అనుకున్నట్టుగా చిరంజీవి, బాలకృష్ణ గారి వయస్సుతో తాను ఇబ్బంది పడలేదని ఎందుకంటే వారి పక్కన నేను కరెక్ట్ గా సూట్ అవుతానని దర్శకులు భావిస్తే ఇక టెన్షన్ నాకెందుకు అంటూ తెలియజేసింది. ప్రస్తుత శృతిహాసన్ చేతిలో సలార్ సినిమా మాత్రమే ఉంది.