ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. చిరంజీవి సినిమాతో పాటు బాలయ్య సినిమా ఒక్కరోజు ముందుగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కూడా ఉండడం చిరంజీవి ఎనర్జిటిక్ కి రవితేజ ఎనర్జిటిక్ ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఈ రెండు సినిమాల హీరోయిన్గా శృతిహాసన్ నటించింది. ఈ సినిమా చిరంజీవి వీరాభిమాని డైరెక్టర్ బాబి కొల్లి తెరకెక్కించారు. చిరంజీవినీ ప్రేక్షకులు ఏ విధంగా చూడాలనుకున్నారో అదే విధంగా చూపించారు డైరెక్టర్ బాబీ.
దీంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి గా ఫీల్ అవుతున్నారు. బాస్ ఇస్ బ్యాక్ అంటూ చిరంజీవిని తెగ పొగిడేస్తూ ఉన్నారు. ఇక ఏడవ రోజు కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది .ఏడవ రోజు.. రూ.4.85 కోట్ల రూపాయలు కలెక్షన్లను సొంతం చేసుకుంది. అయితే గతంలో విడుదలైన సినిమాలు లిస్టులో ఈ సినిమా ఆరవ స్థానం దక్కించుకుంది ఓవరాల్ గా టాప్ 7లో చిరంజీవి సినిమాలు మూడు ఉండడం గమనార్హం. ఒకేసారి టాలీవుడ్ లో ఏడవ రోజు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల విషయానికి వస్తే..
అలా వైకుంఠపురం సినిమా రూ.8.43 కోట్లు సాధించి మొదటి ప్లేస్ లో ఉంది. ఇక బాహుబలి 2 సినిమా రూ.8.30 కోట్లతో రెండవ స్థానంలో ఉంది. సైరా నరసింహారెడ్డి రూ.7.90 కోట్లతో మూడో స్థానంలో ఉంది. సరిలేరు నీకెవరు సినిమా రూ.7.64 కోట్లతో నాలుగో స్థానంలో ఉంది. RRR చిత్రం రూ.7.48 కోట్లత ఐదవ స్థానంలో ఉంది. టాప్ సిక్స్ సినిమా చిరంజీవి ఖైదీ నెంబర్ 150 రూ.5.28 కోట్లతో ఆరవ స్థానంలో ఉంది. ఇక ఏడవ స్థానంలో చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా ఉంది.