టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చే హీరోల్లో ప్రభాస్, శర్వానంద్, అడివి శేష్ ముందు వరుసలో ఉంటారు. ఈ లిస్టులో ఒకప్పుడు రానా కూడా ఉండేవాడు కానీ ఈ దగ్గుబాటి హీరో ఇప్పుడు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాడు. ఇప్పుడు అడివి శేష్, శర్వానంద్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా ఉన్నారు. ముందుగా అడవి శేష్ పెళ్లెప్పుడు చేసుకుంటావు అంటే శర్వానంద్ తర్వాతనే అంటాడు. సర్లే అని శర్వానంద్ ని పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అంటే ప్రభాస్ చేసుకున్నాక అంటాడు.
ఇప్పుడు ఈ చైన్ సర్కిల్ ని బ్రేక్ చేయడానికి ఓ యంగ్ హీరో కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తున్నాడు. శర్వానంద్ ని పెళ్లి చేసుకో అన్న అంటూ కన్విన్స్ చేసే పనిలో ఉన్న ఆ యంగ్ హీరో మరెవరో కాదు సంతోష్ శోభన్. పెళ్లి గురించి చెబుతూ వెడ్డింగ్ యాంతం కూడా పాడేస్తున్నాడు. ఇక ఇంతకీ అసలు సంతోష్ శోభన్కి ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి అనుకుంటున్నారా? ఇక తాజాగా ఆతను నటిస్తున్న కొత్త మూవీ కళ్యాణం కమనీయం ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా వెడ్డింగ్ యాంతం అనే సాంగ్ ను డిజైన్ చేశారు. ఈ క్రేజీ సాంగ్ ని ప్రభాస్ లాంచ్ చేయడం మరో విశేషం. ఇక మరి హీరో శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అతను కూడా ఈ సాంగ్లో కనిపించడం మరో ఇంటరెస్టింగ్ గా మారింది. ఈ సాంగ్ మొదలైన విధానం కూడా ఎంతో ఫన్నీగా ఉంది. శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందించడమే కాకుండా వోకల్స్ కూడా ఇచ్చిన ఈ సాంగ్ లిరిక్స్ ని కృష్ణ కాంత్ రాశాడు.
ఈ సాంగ్ మొత్తం అయిపోయిన తర్వాత.. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థమైంది అంటూ శర్వానంద్ ప్రభాస్ కి కాల్ చేయడం మరో విశేషం.. అందులో మరి ప్రభాస్తో శర్వానంద్ ఏం మాట్లాడాడో తెలియదు కానీ పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రం సంతోష్ శోభన్ పడిన కష్టాలు ఎలా ఉన్నాయో తెలియాలంటే జనవరి 14 వరకు ఆగాల్సిందే.