ఆ సీనియ‌ర్ హీరోకు సాయి ప‌ల్ల‌వి గ్రీన్ సిగ్న‌ల్‌.. ఇదేం కాంబినేష‌న్ రా సామి!

తన సహజ నటనతో తక్కువ సమయంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సాయి పల్లవి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ పాత్రలకు, ఎక్స్పోజింగ్ కు ఆమడ దూరంలో ఉంటూ వస్తున్న సాయి పల్లవి.. కేవలం ప్రాధాన్యత ఉన్న పాత్రలతోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే గ‌త కొంతకాలం నుంచి కెరీర్ పరంగా సాయి పల్లవి బాగా సైలెంట్ అయిపోయింది. గత ఎడాది విడుదలైన విరాట పర్వం, గార్గి చిత్రాల తర్వాత సాయి పల్లవి నుంచి మరో సినిమా రాలేదు. కొత్త ప్రాజెక్టులు అనౌన్స్మెంట్లు కూడా ఏమీ ఇవ్వలేదు.

దీంతో సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పబోతోంది అంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సరైన పాత్రలు రాకపోవడం వల్ల కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయడం లేదని సాయి పల్లవి తెలిపింది. అయితే తాజాగా సాయి పల్లవి ఓ సీనియర్ స్టార్ హీరో కి జోడిగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు తమిళ స్టార్ హీరో అజిత్‌. ఇటీవల తెగింపు మూవీతో ప్రేక్షకులను పలకరించిన అజిత్‌.. తన తదుపరి చిత్రాన్ని నయనతార భ‌ర్త‌, ప్రముఖ దర్శక నిర్మాత విగ్నేష్ శివన్ తో చేయబోతున్నాడు.

అజిత్ కెరీర్ లో తెరకెక్కబోయే 62వ చిత్రం ఇది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ సినిమాకు అనిరుధ్‌ సంగీతాన్ని అందించనున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార, త్రిష వంటి వారి పేర్లు వినిపించాయి. కానీ ఫైనల్ గా సాయిపల్లవిని సెలెక్ట్ చేశారట. పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండడంతో సాయి పల్లవి సైతం ఈ మూవీకి ఓకే చెప్పిందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీంతో ప‌లువురు నెటిజ‌న్లు ఇదేం కాంబినేషన్ రా సామి అంటూ తల పట్టుకుంటున్నారు. ఎందుకంటే అజిత్ పక్కన సాయి పల్లవి న‌టిస్తే హీరోయిన్ గా కాదు కూతురుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వీరి కాంబినేషన్ పై అభిమానులు నెటిజ‌న్లు అస‌హ‌నం వ్యక్తం చేస్తున్నారు.