పైసా వసూల్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతుందా.. ఇక దేవుడే దిక్కు..!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ యంగ్ హీరో రామ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి హిట్ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించిన సినిమా ‘లైగర్’. గత సంవత్సరం ప్రేక్షకులకు ముందుకొచ్చిన ఈ సినిమా మొదటి ఆట నుంచే భారీ నెగటివ్ టాక్ ను తెచ్చుకుని పూరి కెరీర్ లోనే అత్యంత చేత సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమాతో పూరి ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఈ సినిమా తర్వాత పూరి చాలా రోజులు తెలుగు రాష్ట్రాల్లో కనిపించలేదు. ఆ తర్వాత మధ్యలో చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించి మెప్పించాడు. ఆ సమయంలోనే చిరంజీవితో జరిగిన ఓ ఇంటర్వ్యూలో.. పూరీకి చిరు ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు.. ‘నీ దగ్గర మంచి స్టోరీ ఉంటే నేను సినిమా చేయడానికి రెడీ అంటూ ఆఫర్ ఇచ్చాడు’. అప్పటి నుంచి పూరి జగన్నాథ్ తన టీమ్‌ తో మెగాస్టార్ తో చేయబోయే స్క్రిప్ట్ పైన కసరత్తులు చేస్తున్నాడనే వార్తలు కూడా వైరల్ గా మారాయి.

Paisa Vasool' Review: Balakrishna and the film are stuck in the '90s | The News Minute

అయితే ఇప్పుడు పూరీ జగన్నాథ్ త‌న‌ తర్వాత సినిమాపై మరొక క్రేజీ అప్డేట్ వైరల్ గా మారింది. పూరీ త‌న‌ తర్వాత సినిమాను బాలయ్య బాబుతోనే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్ప‌టికే పూరీ బాలయ్య‌తో ‘పైసా వ‌సూల్’ సినిమా తెర‌కెక్కించడు. ఇప్పుడు మ‌రోసారి బాలయ్య కోసం పూరి మంచి ఎంటర్ టైన్మెంట్ ఉన్న కథను రెడీ చేశాడట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ కాంబినేషన్ కన్ఫర్మ్ అయ్యేలా ఉంది అని తెలుస్తుంది. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఇదొక ఎమోషనల్ యాక్షన్ స్టోరీ అని తెలుస్తుంది.

తండ్రి- కొడుకుల మధ్య సాగే ఈ స్టోరీలో పూరి తెరకెక్కించిన ఇడియట్ సినిమాకు కొనసాగింపుగా ఉంటుందనే టాక్ కూడా నడుస్తుంది. ప్రధానంగా ఈ స్టోరీ తండ్రి పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూ లోనే కథ ఉంటుందట. ఈ సినిమాలో ఎమోషన్ కన్నా ప్రధానంగా కామెడీ హైలెట్‌గా సినిమా నడుస్తుందని తెలుస్తుంది. ఇక మరి బాలయ్యతో పూరి సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియాల్సి ఉంది.