తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి పరుగు సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది షీలా కౌర్. ఈ సినిమాతో అచ్చ తెలుగు అమ్మాయిగా పేరుపొందిన ఈమె ఆ తర్వాత అదుర్స్ సినిమాలో తన అందాలను ప్రదర్శించి కుర్రకారులకు నిద్ర లేకుండా చేసింది. చైల్డ్ ఆర్టిస్టుగా కూడా సుమారుగా 20 చైల్డ్ యాక్టర్ గా పలు సినిమాలలో నటించింది షీలా. ఇక నవదీప్ సీతాకోక సినిమాతో మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమైంది. కానీ పరుగు సినిమాతో ఈమెకు బాగా పాపులారిటీ వచ్చింది.ఆ తర్వాత రాజు భాయ్, హలో ప్రేమిస్తారా, మస్కా తదితర సినిమాలలో నటించింది.
ఇక తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ ,మలయాళం వంటి భాషలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా ఉన్నట్టుండి సినీమాలకు దూరమయింది. చివరిగా 2011లో బాలకృష్ణ నటించిన పరమవీరచక్ర సినిమాలో నటించింది.ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పైన పెద్దగా కనిపించలేదు. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు అభిమానులకు దూరంగానే ఉంటుంది అయితే ఒకానొక సందర్భంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన షీలా ను చూసి అక్కడున్న వారంతా గుర్తుపట్టలేకపోయారు. అయితే ఆమె అలా బక్కగా కావడానికి క్యాన్సర్ మహమ్మారి కారణమన్నట్లుగా తెలుస్తోంది.
దీంతో ఇమే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటోంది అన్నట్లుగా కూడా తెలుస్తోంది. సుమారుగా మూడేళ్ల క్రితం వివాహ బంధంలోకి అడుగు పెట్టింది 2020 మార్చిలో కేరళకు చెందిన ఒక వ్యాపారవేత్త సంతోష్ రెడ్డితో కలిసి వివాహం చేసుకుంది. చెన్నైలో కుటుంబ సభ్యులు ,సన్నిహితుల సమక్షంలో ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్ గా ఈ వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తన భర్తతో కలిసి సూపర్ మార్కెట్ నడుపుతున్నట్లు సమాచారం.
View this post on Instagram