త‌డిసిన అందాల‌తో మంట‌లు రేపిన జాన్వీ.. ఇలాగైతే కుర్రాళ్లు ఏమైపోతారో!

దివంగత నటి శ్రీదేవి ముద్దుల కూతురు, ప్రముఖ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. ఇండియా వైడ్‌ గా భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అందుకు కారణం అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా.. జాన్వీ కపూర్ ప్రధాన ఆయుధం.

సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే జాన్వీ.. ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటో షూట్లతో అందరి చూపులను తన వైపుకు తిప్పుకుంటుంది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ లో జాన్వీ ఫాలోవర్స్ సంఖ్య 20 మిలియన్లు దాటేసింది. తాజాగా మరోసారి తన అందాలతో కుర్ర‌కారు గుండెల్లో మంటలు రేపింది. వైట్ శారీలో తడిసిన అందాలు, నాజూకు నడుము సోకులు, ఉప్పొంగే ఎద సొగసులతో యమా హాట్ గా ఫోటోలకు పోజులు ఇచ్చింది.

ప్రస్తుతం ఈ పిక్స్ సోష‌ల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఈ పిక్స్ చూస్తే కుర్రాళ్లకు ఏమైపోతారో అన‌కుండా ఉండ‌లేరు. అంత హాట్ గా జాన్వీ దర్శనమిచ్చింది. జాన్వీ అందాలకు నెటిజ‌న్లు పిచ్చెక్కిపోతున్నారు. ఇక సినిమాల విషయానికి వ‌స్తే.. బాలీవుడ్లో రెండు మూడు సినిమాలు చేస్తున్న జాన్వీ త‌ర్వ‌లోనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. `ఎన్టీఆర్ 30`తో పాటు రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్ తో తెర‌కెక్కుతున్న `ఆర్సీ 16`లో జాన్వీ హీరోయిన్గా ఎంపికైందని బలంగా ప్రచారం జరుగుతుంది.