OTT: వీర సింహారెడ్డి సినిమా స్ట్రిమింగ్ అయ్యేది ఎప్పుడంటే..?

ఈ ఏడాది సంక్రాంతి బరిలో విడుదలైన చిత్రాలలో బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. జనవరి 12వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా మాస్ హిట్ గా నిలిచిందని చెప్పవచ్చు. బాలయ్య మాస్ డైలాగులు యాక్షన్ థియేటర్లు దద్దరిల్లిపోయాయని తెలుస్తోంది. ఇక రెండు క్యారెక్టర్లలో బాలకృష్ణ అదరగొట్టేసారని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా బీ,సీ సెంటర్లు ప్రేక్షకులను బాగా అలరించారని చెప్పవచ్చు.

Veera Simha Reddy (2023) - IMDb
భారీగా కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద పెను సంచలనాన్ని సృష్టించిన ఈ సినిమా దాదాపుగా రూ .100 కోట్ల క్లబ్ లోకి చేరినట్లు వార్తలు విపిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని డైరెక్టర్ గోపీచంద్ మలినేని నిర్మించారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించింది . వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు కీలకమైన పాత్రల నటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓటిటి రిలీజ్ డేట్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ ఓటీటి సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీరసింహారెడ్డి స్ట్రిమింగ్ హక్కులను దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమా వచ్చే నెల 21 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రిమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది గతంలో అఖండాన్ని కూడా దగ్గించుకుంది. అందుకే ఈ సినిమాకి భారీ ధరకే అమ్ముడుపోయినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ మెయిన్ అట్రాక్షన్ గా నిలిచాయని చెప్పవచ్చు. అలాగే బాలయ్య ఎనర్జీ తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో అలరించారు.