మాట త‌ప్పిన శ‌ర్వా.. ప్ర‌భాస్‌కు న‌మ్మ‌క ద్రోహం చేశాడంటూ నెటిజ‌న్లు సెటైర్లు!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డితో శర్వా ఏడడుగులు వేయబోతున్నాడు.

నేడు హైదరాబాదులోని ఓ హోటల్ లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో శర్వానంద రక్షిత రెడ్డి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది.

ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయ‌న సతీమణి ఉపాసన, చిరంజీవి దంప‌తులు, నాగార్జున దంప‌తులు, అల్ల‌రి న‌రేష్ దంప‌తులు, శ్రీ‌కాంత్‌, ద‌గ్గుబాటి రానా, సిద్ధార్థ్, అదితిరావు హైదరీ ఇలా చాలా మంది సినీ ప్రిముఖులు పాల్గొన్నారు.

ఇప్పటికే శర్వానంద్‌ నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే శర్వా ఎంగేజ్మెంట్ పై నెటిజ‌న్లు సరదాగా సెటైర్లు పేలుస్తున్నారు.

అందుకు కార‌ణం లేక‌పోలేదు. ఇటీవల బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` టాక్ షోలో శ‌ర్వానంద్ పాల్గొన్నాడు.

అయితే ఈ షోలో బాలయ్య పెళ్లి ఎప్పుడు? అని ప్రశ్నించగా.. అందుకు శ‌ర్వా స్పందిస్తూ ప్రభాస్ తర్వాత చేసుకుంటానని చెప్పుకొచ్చాడు.

ఇప్పుడు అనూహ్యంగా ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లికి రెడీ అయ్యాడు. దీంతో శ‌ర్వా మాట తప్పడని.. ప్రభాస్ కు నమ్మకద్రోహం చేశాడని సరదాగా సెటైర్లు వేస్తున్నారు.