మొత్తానికి వీరసింహారెడ్డి సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే..?

నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మల్లి నేను దర్శకత్వంలో వస్తున్న చిత్రం వీర సింహారెడ్డి. హీరోయిన్ల శృతిహాసన్ కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ నటిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 12వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. భారీ అంచనాల మధ్య రూపొందించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్, యూకే, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాలలో కూడా భారీగా విడుదల కాబోతోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉన్న కొద్ది చిత్ర బృందం ప్రమోషన్లను చాలా వేగవంతం చేసింది. గడిచిన రెండు రోజుల క్రితం ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేయడం జరిగింది కూడా చాలా గ్రాండ్గా చేశారు.

Latest: Veera Simha Reddy clears its censor formalities | 123telugu.com

తాజాగా ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయినట్లుగా సమాచారం. ఇక ఈ సినిమా యొక్క సెన్సార్ టాక్ పాజిటివ్ గానే రావడం జరిగిందట.చిత్ర యూనిట్ సభ్యులు అనఫీషియల్ గా చెబుతున్న దాని ప్రకారం సెన్సార్ బోర్డ్ సభ్యులు సినిమా నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని తెలిపినట్లు సమాచారం. సినిమా యొక్క సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అవ్వడంతో ఇక ఈ సినిమా విడుదల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఈ సినిమా కార్యక్రమాల ప్రమోషన్స్ ని కూడా ముగించేశారు.

చివరి రెండు రోజులు బాలయ్య లేకపోతే చిత్ర బంధం ఇంటర్వ్యూ లేకపోతే మీడియాతో ఇంట్రాక్ట్ అయ్యే విధంగా ఒక ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇక నందమూరి అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతంగా ఎదురుచూస్తున్నారు. ఈ సంక్రాంతికి చిరంజీవితో బాలయ్య 11వసారి పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది మరి ఈ సంక్రాంతికి ఎవరు విజేతగా నిలుస్తారు తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.