మంచు కుటుంబంలో నుంచి హీరోగా అడుగుపెట్టిన వారిలో మంచు మనోజ్ కూడా ఒకరు. దాదాపుగా గడిచిన ఐదు సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. చివరిగా ఒక్కడు మిగిలాడు అనే సినిమాతో మంచు మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ మధ్య అహం బ్రహ్మాస్రి అనే సినిమా ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్ లు కూడా మొదలుపెట్టారు. కానీ ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉండగా 2019లో తన వ్యక్తిగత కారణాలవల్ల తన భార్య ప్రణీతి తో విడిపోవడం జరిగింది మంచు మనోజ్.
అయితే ఆమె నుంచి విడాకులు తీసుకొని వార్తలలో మళ్ళీ నిలిచారు. ఆ తర్వాత మంచు మనోజ్ రెండవ పెళ్లి చేసుకోబోతున్నారంటు వరుస కథలు వినిపించాయి. రీసెంట్గా కడప దర్గాలో కొన్ని ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహించిన మంచు మనోజ్ త్వరలోనే తన సరికొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా కొత్తగా సినిమాలు కూడా ప్రారంభించబోతున్నానని తెలియజేసినట్లు తెలుస్తోంది. దీంతో మంచు మనోజ్ రెండవ పెళ్లి రూమర్ పై మరిన్ని వార్తలు వైరల్ గా మారాయి. గడిచిన కొంతకాలంగా రాజకీయపరంగా బాగా పేరు ప్రఖ్యాతలు పొందిన భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె భూమా మౌనికత సన్నిహితంగా ఉంటున్నారని వార్తలు వినిపించాయి.
త్వరలోనే ఇద్దరు కలిసి వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ ఇరువురు కుటుంబాల అంగీకారంతోనే వివాహం చేసుకోబోతున్నారని సమాచారం.తాజాగా ఈ వార్తలపై కడప దర్గాలు క్లారిటీ ఇచ్చారు మంచు మనోజ్. దీంతో మంచు మనోజ్ పెళ్లి వార్త నిజమేనని తాను భూమిక మౌనికని త్వరలో వివాహం చేసుకోబోతున్న అని ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లో వీరి వివాహ ప్రకటన కూడా వెలుపడుతుందని సమాచారం.