జగన్‌ను టార్గెట్ చేసిన టాలీవుడ్ డైరెక్టర్.. ఆ వెబ్‌సిరీస్‌లో కాంట్రవర్షల్ డైలాగ్స్??

ప్రస్తుతం వచ్చే కొన్ని సినిమాలలో రాజకీయాల గురించి కౌంటర్లు ఎక్కువవుతున్నాయి. ఆ కౌంటర్లను కొంతమంది సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అలానే కొంతమంది హీరోలు కూడా రాజకీయ నాయకులను దృష్టిలో పెట్టుకొని సినిమాలలో డైలాగ్స్‌ చెప్పి ట్రోల్స్‌కి గురవుతూ ఉంటారు. అయితే డైరెక్టర్ హరీష్ శంకర్ రాసిన ఒక డైలాగ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఆ డైలాగ్ ని నటుడు పృథ్వీ చెప్పడం అనేది మరింత హాట్ టాపిక్ గా మారింది.

ఇక అసలు టాపిక్ లోకి వెళ్తే, హరీష్ శంకర్‌కి కథ అందించిన ఒక వెబ్ సిరీస్‌లోని సీన్ వైరల్ అవుతోంది. దిల్ రాజు ప్రొడక్షన్ లో హరీష్ శంకర్ కథ అందించిన ‘ఏటీఎం’ వెబ్‌సిరీస్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5లో రిలీజ్ అయింది. ఆ వెబ్‌సిరీస్‌కి సంబంధించిన కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చెప్పిన కొన్ని డైలాగ్స్ పాలిటిక్స్ కి సంబంధించినవిగా ఉన్నాయని కొంతమంది కామెంట్స్ చెందుతున్నారు. అయితే ఆ వెబ్‌సిరీస్‌లో జగన్ అనే పాత్ర బాగా హైలెట్ అయింది. ఇక ఆ సిరీస్‌లో మోసం జరుగుతుంది. దాంతో పృథ్వీ చెప్పే ‘కోట్లు దొబ్బేసి.. మాకు కోటి ఇస్తావా’ అనే డైలాగ్ పాలిటిక్స్‌లో చర్చనీయంశం అయింది.

ఇక పృథ్వీ’రేయ్ జగన్ నీకు మానవత్వం లేదురా..!!’ అని చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది. అయితే కొంతమంది పృథ్వీ ఎవరిని టార్గెట్ చేసాడో మాకు అర్ధమవుతుంది అని అంటుంటే.. మరి కొంతమందేమో ఎవరూ ఊహించని విధంగా రియాక్ట్ అవుతున్నారు. ఒకప్పుడు పృథ్వీ రాజకీయాల్లో ఉన్నాడు కానీ కొన్ని సంఘటనల వల్ల రాజకీయాల నుంచి బయటకి వచ్చి మళ్ళీ సినిమాలలో బిజీ అయ్యాడు.