మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా రేపటి రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో గడిచిన కొద్ది రోజుల నుంచి ఈ సినిమా ప్రమోషన్లు చిత్ర బృందం చాలా బిజీగా ఉంటోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది. ఈ సినిమాని డైరెక్టర్ బాబి తెరకెక్కించారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రచార కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్న చిరంజీవి పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేశారు. ఇందులో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ.. రోజా చేసిన వ్యాఖ్యల పైన స్పందించినట్లు తెలుస్తోంది.
ఇక చిరంజీవి మాట్లాడుతూ… ఆమె మాటల పైన తాను ఎలాంటి కామెంట్స్ చేయనని గతం లో తనతో కలిసి ఎన్నో చిత్రాలలో నటించాను తనతో పాటు సెంటిమెంటు కూడా పంచుకున్నానని తెలిపారు. బ్లడ్ బ్యాంక్, ఐబ్యాంకుతోపాటు కరోనా సమయంలో సినీ కార్మికులకు కావలసిన సహాయం చేశానని ఇవన్నీ తన హెల్పింగ్ నేచర్ కు నిలువెత్తు సమాధానమని ఆమె అన్న మాటలకు తను ఆన్సర్ ఇస్తే తన స్థాయి తగ్గించుకున్న వాడిని అవుతానని చిరంజీవి తెలియజేసినట్లు సమాచారం. ఆమె మంత్రి అయ్యాక కూడా తన ఇంటికి వచ్చారని ఇక్కడే భోజనం కూడా చేశారని ఎప్పుడు సొంతమనుసుల తిరిగామని తెలిపారు చిరంజీవి.
వారు ఎలాంటి పరిస్థితుల్లో అలా మాట్లాడారు తెలియక స్పందించడం మాట్లాడడం నా నైజం కాదని వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలియజేశారు చిరంజీవి. తను ఎన్నోసార్లు అక్క అక్క అంటూ సార్ సార్ అని మా ఇంట్లో భోజనం చేశారని నేను కూడా ఆత్మీయంగా మనస్ఫూర్తిగా ఆహ్వానించాను.. వాళ్లు మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చేసి వాళ్లను తగ్గించి నా సెంటిమెంటు నేను ఇచ్చే విలువను పోగొట్టుకోలేను అంటూ తెలియజేశారు.