తమ సత్తా ఏంటో చూపించిన చిరు – బాలయ్య..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి కొత్త తరం వచ్చేసింది. ఇప్పుడంతా ఆ కొత్త హీరోలదే హవా జరుగుతోంది అన్న భ్రమలో ఉన్న వారికి షాక్ తగిలేలా చేశారు మెగాస్టార్ చిరంజీవి , నటసింహ బాలకృష్ణ.. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ తర్వాత ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా ఉన్నారు నాగార్జున, వెంకటేష్, బాలయ్య, చిరంజీవి. ముఖ్యంగా వీరిలో చిరంజీవి , బాలకృష్ణ మధ్య ఎప్పుడూ కూడా పోటీ ఉంటుంది. ఇద్దరి సినిమాలు కూడా పోటా పోటీగా రిలీజ్ అయ్యేవి. అయితే ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్లీ సంక్రాంతికి వీరిద్దరి సినిమాలు తలపడ్డాయి. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలతో పాటు హీరోలు కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పండుగ రోజుల్లో కుటుంబ సభ్యులతో సినిమాకు వెళ్లడం తెలుగువారికి అలవాటుగా మారిపోయింది. అందుకే సంక్రాంతికి సినిమా విడుదలై హిట్ టాకు తెచ్చుకుంటే కలెక్షన్లు సునామి ఖాయం అని విశ్లేషకులు చెబుతూ ఉంటారు.

ఇకపోతే జనవరి 12వ తేదీన బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, జనవరి 13వ తేదీన చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు ఒక్కరోజు తేడాతో విడుదలయి వాతావరణంను ఒక్కసారిగా హీటెక్కించారు. పైగా రెండు సినిమాలు కూడా మంచి మాస్ ఎంటర్టైనర్ గా టాక్ సొంతం చేసుకోవడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా కుర్ర స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. మైండ్ బ్లాక్ పెర్ఫార్మెన్స్ తో ఇద్దరు సీనియర్ హీరోలు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతున్నారు. వింటేజ్ స్టైల్ లో వసూలు వర్షం కురిపిస్తున్నారు.

ఇకపోతే బాలయ్య సినిమా వీరసింహారెడ్డి నాలుగు రోజుల్లో రూ.104 కోట్ల గ్రాస్ వసూలు చేయగా .. చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య మూడు రోజుల్లోనే రూ. 108 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తెలియజేశారు. మొత్తంగా ఈ రెండు సినిమాలు ఇప్పటికే 212 కోట్ల రూపాయలు వసూలు రాబట్టడంపై ట్రేడ్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయం తెలిసి అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.