మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఓ విలాసవంతమైన ఇల్లు ఉన్న సంగతి తెలిసిందే. అన్ని సౌకర్యాలతో ఎంతో అందంగా ఆయన తన ఇంటిని డిజైన్ చేయించుకున్నారు. ఇంద్ర భవనానికి చిరంజీవి ఇల్లు ఏ మాత్రం తీసిపోదు. అటువంటి ఇంటిని కాదని చిరంజీవి వైజాగ్ లో సెటిల్ అవ్వాలని చూస్తున్నారట. వైజాగ్ లో ల్యాండ్ కూడా కొనేశారట.
ఈ విషయాన్ని చిరు స్వయంగా వెల్లడించారు. ఈ సంక్రాంతికి చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ కీలక పాత్రను పోషించాడు. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో మాస్ ఎంటర్టైర్గా రూపుదిద్దుకున్న ఈ చత్రం జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఆదివారం సాయంత్రం వైజాగ్ లో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ ఈవెంట్లో చిరు వైజాగ్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు.
`విశాఖలో విశాలమైన మనసు ఉన్న ప్రజలు ఉంటారు. ఈ నగరం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ప్రజల్లో కుళ్ళు కుతంత్రాలు ఉండవు. ఎంతో సరదాగా ఉంటారు. రిటైర్ అయిన తర్వాత చాలా మంది ఇక్కడ సెటిల్ కావాలని కోరుకుంటారు. నాకు కూడా అలాంటి చిరకాల కోరిక ఉంది. అందుకే ఈ మధ్యనే విశాఖలో ల్యాండ్ కొన్నాను. ఇంకా ఇల్లు కట్టాలి. తర్వలోనే నేను విశాఖ పౌరుడిగా మారతారు. అది నా కోరిక` అంటూ చిరు చెప్పుకొచ్చారు. దీంతో ఈయన కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.