మెగాస్టార్ చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య` సినిమా నేడు అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించారు. శృతి హాసన్, కేథరిన్ ఇందులో హీరోయిన్లు గా నటించారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి.. మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. మే నెలలో మెగా ఫ్యాన్స్ కు మళ్లీ జాతర ఉండబోతోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. `వాల్తేరు వీరయ్య` విడుదలైన మూడు నెలల్లోనూ చిరు నుంచి మరో సినిమా రాబోతోంది. అదే `భోళా శంకర్`.
మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. చిరు సోదరిగా కీర్తి సురేష్ కనిపించబోతోంది. అయితే తాజాగా ఈ మూవీపై చిరు ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. `భోళా శంకర్ సినిమా ఇప్పటి వరకు ముప్పై శాతం చిత్రీకరణ పూర్తయింది. కొత్త షెడ్యూల్ ను సంక్రాంతి తర్వాత అంటే జనవరి 17వ తారీకు నుండి మొదలు పెట్టబోతున్నారు. సినిమాను సమ్మర్ కానుకగా మే నెలలో విడుదల చేయాలని భావిస్తున్నాం` అంటూ పేర్కొన్నాడు. ఈ అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.