డైరెక్టర్ తేజ తెరకెక్కించిన ప్రేమ కథ సినిమాలలో జయం సినిమా కూడా ఒకటి.. ఈ సినిమాతోనే నితిన్- సదా హీరో హీరోయిన్లుగా టాలీవుడ్కు పరిచయమయ్యారు. ఇందులో మ్యాచో స్టార్ గోపీచంద్ విలన్ గా నటించాడు. 2002 జూన్ 14న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈసినిమా అప్పట్లోనే సెన్సేషనల్ హిట్గా నిలిచింది. తొలి సినిమాతోనే నితిన్- సదా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.
ఈ సినిమా విడుదలై 20 సంవత్సరాల అవుతున్న ఇప్పటికీ ఈ మూవీ క్రేజ్ తగ్గ లేదంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన వారే కాకుండా.. సదా చెల్లి క్యారెక్టర్ లో కనిపించిన అమ్మాయి కూడా ఎంతో అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో అక్షరాలు తిప్పి రాసే అమ్మాయిగా నటించి మెప్పించింది. అంతేకాకుండా ఈ ఒక్క సినిమాతోనే ఏకంగా నంది అవార్డును గెలుచుకుంది ఈ చైల్డ్ ఆర్టిస్ట్.
ఈ సినిమాలో సదకు చెల్లిగా నటించింది ఎవరు..? ప్రస్తుతం ఆమె ఏం చేస్తుంది..? అంటూ నెటిజెన్లు ఆరా తీస్తున్నారు. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. ఆ అమ్మాయి పేరు యామిని శ్వేత.
ఈ అమ్మాయి మరెవరో కాదు సీనియర్ సీరియల్ ఆర్టిస్ట్ జయలక్ష్మి కూతురే జయం సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ యామిని శ్వేత. ఈమె తన చిన్నతనంలోనే అటు బుల్లితెరపై ఇటు వెండి తెరపై కనిపించి బాలనటిగా గుర్తింపు తెచ్చుకుంది యామిని. తర్వాత పెద్దయ్యక చిత్ర పరిశ్రమకు దూరమైంది.
అయితే ఈమె జయం సినిమా కంటే ముందే పలు బుల్లితెర సీరియల్స్ లో నటించింది. ఈ క్రమంలోనే సీతామహాలక్ష్మి సీరియల్ చేస్తున్న సమయంలోనే ఈమెకు జయం సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఉత్సాహం, అనగనగా ఓ ధీరుడు వంటి పలు సినిమాల్లో నటించింది. ఆ సినిమాల తర్వాత చిత్ర పరిశ్రమకు దూరమైంది యామిని. ఇక ఈమె విదేశాలలో మాస్టర్స్ పూర్తి చేసి తర్వాత పెళ్లి చేసుకుని ప్రస్తుతం గృహిణిగా సెటిలైంది. విరికి ఒక పాప కూడా జన్మించింది. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.