పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది సీనియర్ హీరోయిన్ నదియా. ఇక అందులోనూ ఈ సినిమాలో పవన్ కు అత్తగా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాకుండా ఈ సినిమాలో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా నదియాకు అవార్డులు కూడా వచ్చాయి.
ఆ తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాలో కూడా అతనికి అమ్మగా నటించి మెప్పించింది. తర్వాత వెంకటేష్ హీరోగా వచ్చినిన దృశ్యం, రామ్ చరణ్ బ్రూస్ లీ, నితిన్ అ ఆ, మహేష్ బాబు నటించిన వచ్చిన సర్కారు వారి పాట, నాని అంటే సుందరానికి, రామ్ ది వారియర్ వంటి పలు సినిమాలలో నదియా నటించింది. తెలుగులో ఫుల్ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలతో దూసుకుపోతుంది నదియా.
అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఒకప్పుడు సౌత్ సినిమా పరిశ్రమలోనే స్టార్ హీరోయిన్. ఇటు తెలుగుతోపాటు తమిళ్, మలయాళం సినిమాలో అగ్ర హీరోల సరసన నటించింది. ఈ క్రమంలోని ఈమె సినిమాల్లో బిజీగా ఉండగానే 1988లో అమెరికన్ వ్యాపారవేత్త అయిన మ్యాన్ శిరీష్ గాడ్ బోల్ను పెళ్లి చేసుకుంది నదియా. ఆ తర్వాత తన ఫ్యామిలీతో కలిసి యూఎస్ చెక్ చేసింది.
ఇక ఈ దంపతులకు 1996లో సనమ్ అనే కూతురు కూడా జన్మించింది. ఆ తర్వాత మరో ఐదేళ్లకు అంటే 2001లో రెండో కూతురు జానా కూడా వీరికి జన్మించింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు మల్లి ఇండియా తిరిగి వచ్చిన ఈ సీనియర్ హీరోయిన్ తన ఫ్యామిలీతో చెన్నైలో స్థిరపడింది. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండని నదియా.. ఈ మధ్యకాలంలో తన కూతుళ్ల ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఆ ఫోటోలు చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఎందుకంటే వారు వాళ్ళ అమ్మ కంటే మించిన అందంతో అక్కాచెల్లెళ్లు సోషల్ మీడియాలో ఊపేస్తున్నారు. ప్రస్తుతం ఈ అక్క చెల్లెళ్ల ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
View this post on Instagram