తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ తొలిసారిగా నందమూరి హీరో ఎన్టీఆర్ తో కలిసి నటించిన పాన్ ఇండియా చిత్రం RRR. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. దీనికి ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మ రథం పట్టారు. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా పెను సంచలనాన్ని సృష్టించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించడమే కాకుండా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది.
ఈ చిత్రం గోల్డెన్ గ్లోబుల్ ఆస్కార్ అవార్డులలో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నాటు నాటు పాటకు.. బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్ విభాగంలో అవార్డును దక్కించుకుంది. అంతేకాకుండా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులో కూడా RRR సినిమా రెండు కేటగిరీలలో అవార్డు దక్కించుకోని సంచలనాన్ని సృష్టించింది. హాలీవుడ్ స్టార్స్ అండ్ టెక్నీషియన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డులకు RRR షార్ట్ లిస్టులో చేయబడిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక గడచిన కొద్ది రోజుల నుంచి ఉత్తమ నటుడు కేటగిరిలో ఎన్టీఆర్ పేరు చాలా వైరల్ గా మారుతోంది. మార్చి 12న లాస్ ఏంజెల్స్ లో ఈ అవార్డు వేదికగా అట్టహాసంగా జరగబోతోంది.
ఈ రోజున ఆస్కార్ RRR చిత్రానికి వస్తుందో రాదు అనే విషయం తేలిపోతుంది.ఈ మూవీ తో బాలీవుడ్ మార్గాలన్నీ సైతా ఆకర్షించిన రామ్ చరణ్ తాజాగా ఒక మాలివుడ్ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు.. ఈ సందర్భంగా గత 30 ఏళ్లుగా మెగా వెర్సెస్ నందమూరి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ తో తనకు ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ పైన పోటీ గురించి. మెగా నందమూరి, ఫ్యామిలీల మధ్య గడిచిన 30 ఏళ్లుగా పోటీ ఉంది. అయితే అది నందమూరి తారకరామారావుకు నాన్న చిరంజీవికి మధ్య ఆరోగ్యకరమైన పోటీ అని తెలియజేశారు. ఎన్టీఆర్ తో కలిసి మరొకసారి మల్టీస్టారర్ చేయాలని ఉంది అంటూ క్లారిటీ ఇచ్చారు.