అక్కినేని నందమూరి కుటుంబానికి గొడవలు ఉన్నాయా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావు రెండు కళ్ళు లాంటి వాళ్ళని చెబుతూ ఉంటారు.అయితే వీరిద్దరు మధ్య నటులుగా ఎంతో పోటీ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మాత్రం మంచి స్నేహితులుగా ఉండేవారని చెప్పవచ్చు. అయితే ఎన్టీఆర్ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఏఎన్ఆర్ తో విభేదాలు వచ్చాయని విషయాన్ని ఏఎన్నార్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ తో విభేదాల గురించి గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. అయితే గొడవలు ఎలా ఉన్నప్పటికీ బాలయ్య మాత్రం ఒక దశ వరకు ఏఎన్ఆర్ తో ఆయన కుటుంబ సభ్యులతో చాలా సన్నిహితంగా ఉండేవారు.

అక్కినేనిని హేళన చేయడమేంటి బాలయ్యా!
ఏఎన్ఆర్ ను బాలయ్య బాబాయి అని పిలుస్తూ ఉండేవారు. ఇక నాగచైతన్య హీరోగా ఎంట్రీ ఇస్తున్న సమయంలో బాలయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఏఎన్నార్ ఆయన కుమారుడు నాగార్జునతో బాలయ్యకు దూరం పెరిగిపోయింది. ఆ దూరం ఎంతగా అంటే.. అక్కినేని మరణించినప్పుడు చివరి చూపు చూడడానికి కూడా బాలయ్య వెళ్లలేదట కనీసం సంతాప సందేశం కూడా మీడియాకు విడుదల చేయలేదని అప్పట్లో వార్తలు వినిపించాయి. బాలకృష్ణ తండ్రికి ఒకప్పుడు ఆప్తమిత్రుడు తనను బాబాయి పిలుచుకునే వ్యక్తి ఇండస్ట్రీలో పెద్దలలో ఒకరైన ఏఎన్ఆర్ మరణిస్తే చివరి చూపు చూడడానికి కూడా బాలయ్య వెళ్లలేదంటే అంతగా గొడవ ఏం జరిగి ఉంటుందో అని అభిమానులు ఆలోచిస్తున్నారు.

ఇక నాగార్జున కూడా ఎప్పుడు కూడా బాలయ్య పేరు ఎత్తడానికి ఇష్టపడడు.. బాలయ్యను కలవడానికి కూడా పెద్దగా ఇష్టం చూపరు. బాలయ్య రెండో కుమార్తె వివాహ సమయంలో కూడా నాగార్జున ఆ పెళ్లికి హాజరు కాలేదు. తాజాగా వీర సింహారెడ్డి విజయోత్సవ వేడుకలలో.. బాలయ్య అక్కినేని తొక్కినేని అనే మాట అనడంతో మరొకసారి అక్కినేని ఫ్యామిలీ బాలయ్య ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నాయని విషయం బయటికి వచ్చింది. మరి అసలు విషయాన్ని ఎవరు తెలియజేస్తారో చూడాలి.