ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ `పుష్ప`. 2021లో విడుదలైన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 రాబోతోంది. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అయితే ఈ మూవీ షూటింగ్ చూడాలని కోరుకునే వారికి ప్రముఖ నిర్మాత బన్నీ వాసు బంపర్ ఆఫర్ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కశ్మీర పర్ధేశీ జంటగా మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `వినరో భాగ్యము విష్ణు కథ`. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరి 17న విడుదల కానున్న ఈ చిత్రానికి వినూత్నంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే VVIT వర్సెస్ VBVK అంటూ గుంటూరు కాలేజ్ క్రికెట్ టీమ్తో మ్యాచ్ ఆడింది.
ఆ మ్యాచ్లో ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ సైదులు చేతుల మీదుగా `ఓ బంగారం నీ చెయ్యి తాకగానే ఉప్పొంగిపోయిందే నా ప్రాణం` సాంగ్ రిలీజ్ చేయించింది. ఈ సందర్భంగా బన్నీ వాసు ఒక బంపరాఫర్ ఇచ్చారు. `ఓ బంగారం సాంగ్ను రీల్ చేసి గీతా ఆర్ట్స్ను ట్యాగ్ చేయండి. సెలెక్ట్ అయిన పది మందికి, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ కు ఈ సినిమాను ఫ్రీగా చూపిస్తాం. అంతేకాకుండా కాకుండా వాళ్లను పుష్ప షూటింగ్కు కూడా తీసుకెళ్తాం` అంటూ ప్రకటించారు. మరి ఆ పది మందిలో మీరూ ఒకరు కావాలనుకుంటే వెంటనే ఓ బంగారం సాంగ్ను రీల్ చేసి గీతా ఆర్ట్స్ను ట్యాగ్ చేయండి.