సమంత వల్ల ఆ మూవీ టీమ్‌కి కొత్త తలనొప్పులు.. ఇదేం కర్మ అంటూ?

టాప్ ఇండియన్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి “సిటాడెల్” అనే చిత్ర షూటింగ్‌లో పాల్గొంటోంది. ఆమె ముందుగా “ఖుషి” అనే సినిమాని పూర్తి చేయాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ఆమె దానిని ఆలస్యం చేస్తోందని తెలుస్తోంది. సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం, సమంతా తన మునుపటి చిత్రం “మజిలీ”లో దర్శకుడు శివ నిర్వాణ తనను చూపించిన విధానానికి బాగా సంతోషించింది. ఈ సినిమాలో తాను మాత్రమే హైలెట్ అయ్యేలా శివ నిర్వాణ ఆమె పాత్రను రాసుకోవడం ఆమెకు నచ్చింది. అయితే సమంత ఖుషి సినిమాలో కూడా తన పాత్రకు మరింత ప్రాధాన్యతనిస్తూ, సినిమా అంతటా ఉండాలని కోరుకుంటుంది.

అయితే, “ఖుషి” దర్శకుడు ఈ మార్పులు చేయలేదు. తన పాత్ర చాలా లిమిటెడ్ గా మాత్రమే ఉంది విజయ్ దేవరకొండ మాత్రమే హైలైట్ అయ్యేలా రాసుకున్నారట. అందుకే సమంత అలిగి ఈ ప్రాజెక్ట్ కోసం అందుబాటులోకి రావడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె తన పాత్ర బాగుండాలని పట్టు పట్టడంతో మూవీ టీం కి కొత్త తలనొప్పిలు వచ్చాయి అని కూడా చర్చ జరుగుతోంది. సమంత ఆట కాదనలేక మూవీ టీమ్‌ సభ్యులు ఫిబ్ర‌వ‌రిలో మ‌ళ్లీ “ఖుషి” చిత్రీక‌ర‌ణ ప్రారంభిస్తార‌ని నిర్మాణ బృందంలోని కొంత మంది అంటున్నారని టాక్. అయితే ఈ ప్రచారం ఇండస్ట్రీ లోపల జరుగుతోంది కాబట్టి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.

“ఖుషి” అనేది ఒక రొమాంటిక్ కామెడీ ఫిలిం. దీనికి శివ నిర్వాణ రచన అందించడంతోపాటు దర్శకత్వం వహిస్తున్నాడు. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్నారు. ఇది 2023లో విడుదల కానుంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీత బాణీలు సమకూరుస్తున్నాడు.