అందుకే రష్మిక దూరంగా ఉంటోందా..?

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మొదట కిరిక్ పార్టీ సినిమాతో శాండిల్ వుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మాత్రం ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక తర్వాత వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ గా కూడా పేరు పొందింది. ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే బాలీవుడ్ లో కూడా పలు అవకాశాలను అందుకున్న సక్సెస్ కాలేక పోయింది. ఇక తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి తో నటించిన వరిసు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.

Rashmika Mandanna: I don't have an inspiration from showbiz, as my route  has been very different | Hindi Movie News - Times of India
ఈ సినిమా ఈ నెల 11న తమిళంలో విడుదల కాగా తెలుగులో జనవరి 14న విడుదల అయింది. అంతేకాకుండా డైరెక్టర్ వంశీ పైడిపల్లి రష్మికతో తమిళ మీడియాకు ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ తెలుగు వర్షన్ కి వచ్చేసరికి విజయ్ పెద్దగా పట్టించుకోలేదనే వార్తలు వినిపించాయి. రష్మిక అయినా కూడా మీడియా ముందుకు వచ్చి వారసుడు సినిమా కోసం ప్రమోషన్లలో పాల్గొంటుందని అందరూ భావించారు కానీ అది మాత్రం జరగలేదు.

తెలుగు రాష్ట్రాలలో సినిమా ప్రమోషన్స్ కోసం రష్మిక ముఖం చాటేయడంతో అందుకు బలమైన కారణం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తో కలిసి రష్మిక ఎక్కువగా కలిసి తిరుగుతోందని మాల్దీవులకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ విషయంపై తెలుగు మీడియా ప్రశ్నిస్తుందనే విషయం పైన రష్మిక ముఖం చాటేస్తోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉంటే రష్మిక నటించిన బాలీవుడ్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ గా నిలుస్తున్నాయి.