కుర్ర దర్శకుడితో బాలయ్య భారీ బడ్జెట్ సినిమా.. ఇక కెవ్వు కేకే..

 

సింహ సెంటిమెంటుతో వీర సింహ రెడ్డి సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగి మంచి ఓపెనింగ్స్ ను రాబట్టాడు బాలకృష్ణ. అటు అన్‌స్టాపబుల్ సీజన్ 2తో ఫ్యాన్సు కు బాగా దగ్గర అయ్యాడు బాలకృష్ణ. అలానే సినిమాలు సైతం ఆచితూచి చేస్తున్నాడు. తనకు నప్పిన నైజం తోనే సినిమాలను ఎంచుకుంటూ విజయాలు అందుకుంటున్నాడు. తాజాగా బాలకృష్ణ ఒక యంగ్ డైరెక్టర్ తో ఒక ప్రాజెక్టు కు సైన్ చేశాడని టాలీవుడ్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అతను మరెవరో కాదు అ!, జాంబిరెడ్డి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ.

 

ప్రశాంత్ వర్మ ఆహాలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ షోకు, ప్రోమోలకు దర్శకత్వం వహిస్తూ వస్తున్నాడు. అలా ఈ షో ద్వారా బాలకృష్ణ ప్రశాంత్ వర్మ బాగా దగ్గరయ్యారు. ఈ సాన్నిహిత్యంతోనే ఒకరోజు ప్రశాంత్ వర్మ తన దగ్గర ఒక కథ ఉందని, అది వినాలని కోరగా బాలకృష్ణ అతని మాట కాదనలేక ఓకే విన్నాడట. ఆ కథ నచ్చడంతో ప్రశాంత్ తో కలిసి సినిమా చేసేందుకు ఓకే కూడా చెప్పాడట బాలకృష్ణ. అలా ప్రశాంత్‌ వర్మ తన నెక్స్ట్ డైరెక్టోరియల్‌లో బాలయ్యను హీరోగా పెట్టి సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

ఈ కథ జాంబీరెడ్డి తరహాలో ఒక క్రేజీ ప్రాజెక్టులా ఉంటుందని ఇండస్ట్రీ టాక్. ఇది సైన్స్ ఫిక్షన్ ఆధారంగా తెరకెక్కుతుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. అప్పట్లో తెలుగులో ఆదిత్య 369 సినిమాను చేసిన బాలకృష్ణ పెద్ద విజయం సాధించారు. ఈ సినిమా సైతం అదే రేంజ్ లో ఉండబోతోంది అంటూ బాలయ్య ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే బాలయ్య ఎప్పటిలాగా రోడ్డ కొట్టుడు యాక్షన్ సినిమాలతో కాకుండా క్రేజీ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తే అది కచ్చితంగా సంచలనం సృష్టిస్తుందని చెప్పవచ్చు.