పుష్ప చిత్రంతో పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై ఈ చిత్రంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా మార్చేసింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. హీరోయిన్గా రష్మిక నటించింది. మొదట ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో మొదలయ్యి కలెక్షన్ల పరంగా భారీగానే సంపాదించింది. ఇలాంటి సినిమా రికార్డును తాజాగా నటసింహ బాలకృష్ణ బద్దలు కొట్టడమే కాకుండా టాలీవుడ్ టాప్ కలెక్షన్లను సాధించిన చిత్రాలలో తన సినిమా కూడా నిలిచేలా చేసుకున్నారు.
సంక్రాంతి కానుకగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ అవాయిడెడ్ చిత్రంలో బాలయ్య వీరసింహారెడ్డి సినిమా కూడా ఒకటి. ఈ సినిమా కలెక్షన్లలో పుష్ప సినిమా రికార్డును బ్రేక్ చేసిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. పుష్ప సినిమా తెలుగు స్టేట్లో మొదటి రోజే రూ.24.90 కోట్ల రూపాయలను వసూలు రాబట్టింది దాటేస్తూ తాజాగా రిలీజ్ అయిన బాలయ్య వీరసింహారెడ్డి సినిమా ఏకంగా రూ.25.36 కోట్ల రూపాయల చీరను రాబట్టినట్లు తెలుస్తోంది.అంతేకాకుండా ఫస్ట్ డే అత్యధికంగా షేర్ రాబట్టిన సినిమాలలో 15వ ప్లేసులో నిలిచింది బాలయ్య సినిమా.
ఈ లిస్టులో రూ.74.11 కోట్ల చేరుతూ రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం సెకండ్ ప్లేస్ లో ఉండగా ఆయన సినిమానే బాహుబలి ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇక వీర సింహారెడ్డి సినిమాతో బాలయ్య ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యాక్షన్ సీన్స్ లో తనదైన స్టైల్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలయ్య సరసన హీరోయిన్ శృతిహాసన్ నటించింది. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.