కేశినేని తగ్గట్లేదు..సీటుపై రచ్చ..తమ్ముడుకు షాక్!

విజయవాడ ఎంపీ కేశినేని నాని…మరోసారి సొంత పార్టీ నేతలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. విజయవాడకు చెందిన కొందరు నేతలతో కేశినేనికి ఎప్పటినుంచో పడని విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎప్పట్టికప్పుడు ఆ నేతలు బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల కూడా మైలవరంకు వెళ్ళిన కేశినేని..దేవినేని ఉమా వ్యతిరేక వర్గంగా ఉన్న బొమ్మసాని సుబ్బారావు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ దేవినేని ఉమాపై పరోక్షంగా విమర్శలు చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా నందిగామకు వచ్చిన కేశినేని.. తన తమ్ముడికి సీటు ఇస్తే చచ్చినా మద్దతు ఇవ్వబోనంటూ ప్రకటించారు. టీడీపీలో ముగ్గురు నేతలు ఉన్నారని, వారికి సీట్లు ఇస్తే పార్టీలో పనిచేయబోనని, పరోక్షంగా బుద్దా వెంకన్న, బోండా ఉమా, కేశినేని శివనాథ్‌లపై కామెంట్ చేశారు. చీటర్లు, రియల్ ఎస్టేట్ మోసాలు చేసిన వారు, సెక్స్ వర్కర్లు, కాల్ మనీ గాళ్ళకు టికెట్ ఇస్తే మద్దతు ఇవ్వనన్నారు.

ఇక తన తమ్ముడు శివనాథ్ యాక్టివ్‌గా ఉంటే ఆయన వెంటే తనను తిరగమంటే తానెందుకు తిరుగుతానని ప్రశ్నించారు. తనకు క్యారెక్టర్ ఉందని, రాజకీయాల్లో ఎవరినీ మోసం చేయడానికి రాలేదని చెప్పారు.

మొత్తానికి నెక్స్ట్ ఎన్నికల్లో కేశినేని శివనాథ్‌కు సీటు ఇస్తారనే ప్రచారం నేపథ్యంలో కేశినేని నాని ఈ వ్యాఖ్యలు చేశారు. నెక్స్ట్ నానికి బదులుగా చిన్నికి సీటు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే చిన్ని విజయవాడ రాజకీయాల్లో యాక్టివ్ గా తిరుగుతున్నారు. పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈయనకు బుద్దా, బోండా, దేవినేని లాంటి నేతల సపోర్ట్ ఉంది. అందుకే ఇప్పుడు కేశినేని నాని విరుచుకుపడుతున్నారు. ఎట్టి పరిస్తితుల్లోనూ వారికి సపోర్ట్ చేయనని అంటున్నారు.

అయితే కేశినేని వ్యాఖ్యలు విజయవాడ టీడీపీలో ప్రకంపనలు సృష్టించాయి. టీడీపీ అధిష్టానం ఫోకస్ చేసి పరిస్తితులని చక్కదిద్దకపోతే నష్టం తప్పదు.