సింగర్ గా సినీ పరిశ్రమంలోకి అడుగుపెట్టిన మమతా మోహన్ దాస్ ఆ తర్వాత హీరోయిన్ గా తెలుగు, తమిళ్ మలయాళం వంటి చిత్రాలలో నటించింది. మొదటిసారిగా తెలుగులో ఎన్టీఆర్ సరసన యమదొంగ సినిమాలో నటించగా ఆ తర్వాత వెంకటేష్ తో కలిసి చింతకాయల రవి, నాగార్జున తో కలిసి కేడి వంటి చిత్రాలలో నటించింది. ఆ తర్వాత మలయాళంలో సినిమాల తో బిజీగా అయినప్పటికీ తెలుగులో పలు సాంగులతో అలరించింది ఈ మలయాళ ముద్దుగుమ్మ.
ఇక గతంలో క్యాన్సర్ తో పోరాడి తిరిగి వచ్చిన మమతా మోహన్ దాస్ ఆ తర్వాత లింఫోయా అనే వ్యాధితో కూడా బాధపడుతున్నట్లు తెలియజేసింది.క్యాన్సర్ లాంటి వ్యాధి వచ్చిన బాధపడకుండా ధైర్యంగా అన్నిటిని ఎదుర్కొని ట్రీట్మెంట్ తీసుకొని ఈ వ్యాధుల నుంచి పోరాడి బయటపడింది. క్యాన్సర్ తో పోరాడి వచ్చిన తర్వాత మళ్లీ సినిమాలు చేయడం మొదలుపెట్టింది. ప్రస్తుతం పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళం లో కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటుంది మమతా మోహన్ దాస్.
తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటోని షేర్ చేస్తూ తన శరీరం రంగును కోల్పోయే క్రానికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తో బాధపడుతున్నట్లుగా తెలియజేసింది. అలాగే రోజు దీనికోసం సూర్యకిరణాలు అవసరమని ఇకనుంచి ఉదయాన్నే లేచి సూర్యుడు ముందు కూర్చుంటానని సూర్య కిరణాలు తనని తాకాలని తెలియజేసింది. అయితే ఇప్పటికే క్యాన్సర్ తో పోరాడి బయటికి వచ్చిన ఈమె మళ్లీ ఇంకో వ్యాధితో పోరాడుతుండడంతో అభిమానులు త్వరగా కోలుకోవాలని తెలియజేస్తున్నారు.
View this post on Instagram