వీర సింహారెడ్డి విజయోత్సవ సభలో నందమూరి బాలకృష్ణ `అక్కినేని తక్కినేని` అంటూ వ్యాఖ్యానించడం వివాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై అక్కినేని అభిమానులు బాలయ్యను ఓ రేంజ్ లో ఏకేస్తున్నారు. అక్కినేని నట వారసులు నాగచైతన్య, అఖిల్ సైతం తమదైన శైలిలో బాలయ్యకు కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ విషయంపై బాలయ్య వివరణ ఇచ్చారు. ఫ్లోలో వచ్చిన మాటలే తప్ప ఉద్దేశపూర్వకంగా ఏఎన్ఆర్ గారిని తక్కువ చేసి మాట్లాడలేదని బాలయ్య పేర్కొన్నారు.
`నాగేశ్వరరావుగారిని బాబాయ్ అనేవాడిని, నేనంటే ఆయనకి చాలా ఇష్టం, తన పిల్లలకంటే నన్నే ఎక్కువ ప్రేమగా చూసుకునేవారు. ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. ఎందుకంటే ఆ ఆప్యాయత అక్కడ లేదు. ఇక్కడ ఉంది` అంటూ వ్యంగంగా నవ్వారు బాలకృష్ణ. దీంతో కొత్త వివాదానికి దారి తీస్తుంది. అక్కినేని ఫ్యామిలీతో ఏఎన్నార్కి ఆప్యాయత లేదని బాలయ్య పరోక్షంగా చెప్పడం సరికాదంటూ మళ్లీ ఫ్యాన్స్ ఆయనపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓ ట్వీట్ సంచలనంగా మారింది.
ట్విట్టర్ లో బాలయ్య కుమారుడు నందమూరి మోక్షజ్ఞ తేజ పేరిట ఉన్న ఒక అకౌంట్ నుండి వచ్చిన ట్వీట్ అది. `బాలయ్య బాబు మీద కామెంట్స్ చేస్తున్న నాగ చైతన్య ఫ్యాన్స్ ఒకటి గుర్తు పెట్టుకోవాలి.. మీ హీరో ని ఇండస్ట్రీ కి పరిచయం చేయించిందే బాలయ్య బాబు..మీకు ఆయనని కామెంట్ చేసేంత రేంజ్ ఉందా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి.` అంటూ ఆ ట్వీట్ లో రాసింది. దీంతో చాలా మంది అక్కినేని ఫ్యాన్స్ కి బాలయ్య తనయుడే వార్నింగ్ ఇచ్చాడని అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ట్వీట్ ను తెగ వైరల్ చేశారు. కానీ, నిజానికి అది మోక్షజ్ఞ ట్విట్టర్ అకౌంట్ కాదు. అది ఒక ఫేక్ అకౌంట్ అని తెలిసింది.
https://twitter.com/Mokshagna_Offl/status/1618265187836121090?s=20&t=Fb5vEXmNkfen_7DhiasyNQ